భక్తాదులు, పురోహితులు లక్ష్మీనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎర్రగుంటలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ పురములో గల వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామి వారి ఆరాధన మహోత్సవాలు పురోహితులు లక్ష్మీనారాయణ, భక్తాదులు, ఎల్ సి కె పురం ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పురోహితుల లక్ష్మీనారాయణ గణపతి పూజ, నవగ్రహాలు, శివునికి, అభిషేకం, వీర బ్రహ్మం విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలకు వివిధ పూలలతో అలంకరించి, ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వెయ్యి మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ వేడుకలను భక్తాదులు, ప్రజలు సహాయ సహకారాలతో, దాతల సహృదయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తదుపరి వీరబ్రహ్మం చరిత్ర, వారి మహిమలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట,ఎల్సికుపురం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా జరిగిన వీరబ్రహ్మం స్వామి ఆరాధన మహోత్సవ వేడుకలు..
RELATED ARTICLES