విశాలాంధ్ర నందిగామ:-నందిగామ పురపాలక సంఘం పరిధిలో రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని అధికారులు నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి అధికారులకు సూచించారు నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య వారి ఆదేశాల మేరకు పట్టణంలో రానున్న వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడవలసిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని ఆ దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు సోమవారం పట్టణంలోనే మంచినీటి సరఫరా జరిగే ట్యాంకుల వద్ద నీటి సరఫరా విడుదల కు సంబంధించిన వాల్స్ ను వాటర్ వర్కర్స్ తో కలిసి పరిశీలించారు.
తాగునీటి సమస్య లేకుండా చూడాలి…మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి
RELATED ARTICLES