Friday, May 23, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి650- 2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షలు ఆపము

650- 2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షలు ఆపము

… సిపిఐ, ఏ ఐ టి యు సి.
విశాలాంధ్ర ధర్మవరం;; 650-2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షలు ఆపమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏఐటియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఏఐటియుసి, సిపిఐ, కార్మిక సంఘం, ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు మూడవ రోజు కూడా కొనసాగాయి. అనంతరం మధు, ఎర్రం శెట్టి రమణ, రవికుమార్, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ సంఘం నాయకులు మాట్లాడుతూ 650-2 సర్వే నెంబర్ లో అనర్హులను తొలగించి, అర్హులైన ప్లంబర్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం చేస్తామంటూ వారు తెలిపారు. 650-2 సర్వే నెంబర్ లో ఆర్డిఓ కార్మికుల సమస్యల పైన విచారణ పేరుతో కాలయాపున చేస్తున్నారే తప్ప, ఎటువంటి విచారణ చేపట్టకుండా పోవడం దారుణమన్నారు. కార్మికులను మభ్యపెట్టి వారి పొట్ట కొట్టే విధంగా అవలంబిస్తున్నారు అని మండిపడ్డారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ,అనర్హులైన వారి దొంగ పట్టాలను రద్దుచేసి, అర్హులైన కార్మికుల ఎవరైతే ఉన్నారో వారికి వెంటనే ఇళ్ల పట్టాలు ఇప్పించాలని ఆర్డీవో ను డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో కార్మికులకు న్యాయం జరగకపోతే రెవెన్యూ అధికారులు ను రోడ్డు మీదకు తీసుకొచ్చే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని భారతకమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్లంబర్ అండ్ ఎలక్ట్రిషన్ కార్మిక సంఘం అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, తాజుద్దీన్, రామకృష్ణ, రామసుబ్బయ్య, సురేంద్ర, నాగేంద్ర,చిన్న,జనార్దన్, ఆదినారాయణ, శ్రీనివాసులు,మహిళా సమైక్య నాయకురాలు, లలితమ్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు