Thursday, May 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజలకు మెరుగైన సేవలను అందిస్తాం..

ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తాం..

కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుంపర్తి పరమేష్
విశాలాంధ్ర ధర్మవరం : నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మెరుగైన సేవలు అందిస్తామని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్జీవో హోం లో వారు విలేకరులతో మాట్లాడుతూ తాను టిడిపి హయాంలో ప్రజలకు ఎటువంటి సేవలు చేయలేకపోయారని, నా ఇష్టంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, ఇందుకు సహకరించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి కుమార్తె ఉమా, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి పట్టణ సాయి వరకు అభివృద్ధి పరిచేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తదుపరి పహల్గామీలో మృతి చెందిన వారికి వారు సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పేంతవరకు గట్టి చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి మోడీని కోరారు. అనంతరం ఆర్డిటి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనువెంటనే చర్యలు చేపట్టి ఆర్డిటి సంస్థను కాపాడాలని వారు కోరారు. ఆర్ డి టి దేశంలోనే ప్రముఖ సేవలు అందించుటలో మంచి గుర్తింపు పొందిందని, వేలాదిమంది పేద ప్రజలకు వివిధ సేవలను అందిస్తోందని వారు గుర్తు చేశారు. అలాంటి ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా తిరిగి సేవలు అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలిపారు. అట్లు కానీ ఎడల కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉద్యమాలు, చర్చలు జరుపుతామని తెలిపారు. ఆర్డిటి ప్రజలకు ఆక్సిజన్ లాంటిదని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలు మద్దతు ద్వారా పార్టీకి న్యాయం చేసేలా పోరాటాలు సలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, పతి, రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు