విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని శివానగర్కు చెందిన లలిత (56 సంవత్సరాలు) అనారోగ్యంతోలలేక తీవ్ర మనస్థాపానికి గురై పట్టణంలోని రెండవ మరుగు వద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతురాలు గత కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉండేదని, షుగర్ వ్యాధి వలన కుడి కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో చిటికెన వేలు కూడా తొలగించడం జరిగిందన్నారు. ఆ బాధ భరించలేక మనస్థాపనతో చెరువులో దూకి చనిపోవడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదుదారుడైన విష్ణు సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు.
అనారోగ్యం తాళలేక మహిళ చెరువులో పడి మృతి
RELATED ARTICLES