Friday, June 6, 2025
Homeఅంతర్జాతీయంఅమెరికాపై భారత్‌ ప్రతీకార సుంకాలు

అమెరికాపై భారత్‌ ప్రతీకార సుంకాలు

డబ్ల్యూటీఓ ద్వారా నోటీసులు : తిరస్కరించిన అగ్రరాజ్యం

న్యూదిల్లీ/వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు భారత్‌ వెల్లడిరచింది. ఈ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు సమాచారం ఇచ్చింది. భారత స్టీల్‌, అల్యూమినియంపై సుంకాలకు ప్రతికార సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా అమెరికాకు నోటీసులు పంపింది. వాటిని అమెరికా తిరస్కరించింది. నోటీసులు బహుపాక్షిక వాణిజ్య నియమాలకు అనుగుణంగా లేవని పేర్కొంది. స్టీల్‌, అల్యూమినియంపై సుంకాలు భారత్‌ చెప్పినట్లు ‘భద్రతా చర్యలు’ కాదని, జాతీయ భద్రతా పరిగణనలపై ఆధారపడి ఉన్నాయని అగ్రరాజ్యం వెల్లడిరచింది. దీనిపై భారత్‌తో చర్చలు జరిపేది లేదని కూడా స్పష్టంచేసింది. ఈ పరిణామాల క్రమంలో అమెరికా దిగుమతులపై రాయితీల తొలగింపునకు భారత్‌ సిద్ధమైంది. అమెరికా నుంచి వచ్చే లోహాలపై అధిక సుంకాలు విధించాలని నిర్ణయించింది. భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న స్టీల్‌, అల్యూమినియంలపై అమెరికా 25 శాతం సుంకాలు విధిస్తున్నది. అయితే ఈనెల 4వ తేదీ నుంచి వాటిని 50 శాతానికి పెంచుబోతోంది. దీంతో 7.6 బిలియన్‌ డాలర్ల విలువైన భారత్‌ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే జరగబోతోందని చెబుతున్న క్రమంలో తాజా పరిణామానికి ప్రాధాన్యత ఏర్పడిరది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు