Tuesday, June 24, 2025
Homeఆంధ్రప్రదేశ్కృత్రిమ మేధతో మరింత వృద్ధి

కృత్రిమ మేధతో మరింత వృద్ధి

ఏఐ ఈకో సిస్టమ్‌తో ఐటీలో మేటిగా ఏపీ
యువతకు మెరుగ్గా ఉద్యోగావకాశాలు

విశాలాంధ్ర-సచివాలయం : రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ప్రారంభిస్తే అతి పెద్ద టెక్‌ భాగస్వామ్యానికి రాజధాని అమరావతి వేదికగా మారనుంది. నైపుణ్య శిక్షణ, పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్టార్టప్‌ల ప్రోత్సాహంతో ఏఐ ఈకో సిస్టమ్‌ సిద్ధం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గడిచిన ఏడాది కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ అమరావతి రాజధానిని వేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. అందులో భాగంగానే భారీ సంస్థలను నెలకొల్పేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అమరావతి వేదికగా యువత కోసం మెగా సంస్థలను స్వాగతిస్తూ ఆ దిశగా వారికి అవసరమైన మౌలిక నదుపాయాలను కల్పిస్తున్నారు. దీంతో అతి తక్కువ సమయంలోనే దేశంలోనే మరే రాష్ట్రంలో లేనివిధంగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలు తమ కార్యకలాపాలను ఏపీ నుంచి ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏఐ యూనివర్సిటీకి సంబంధించి అమరావతిలో తొలి అడుగు పడిరది. అమరావతిలో ఇంటెలిజెన్స్‌-ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం అనేక రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ, మహారాష్ట్ర సంబంధిత టెక్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దీంతో ఏ రాష్ట్రంలో మొదట ఏఐ యూనివర్సిటీ వస్తుందనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అమరావతి రాజధాని వేదికగా ఏర్పాటు కాబోతున్న ఏఐ యూనివర్సిటీ తన కార్యకలాపాలను ప్రారంభిస్తే రానున్న రెండేళ్లలో సుమారు 10 వేల మంది విద్యార్థులకు శిక్షణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో యువత పెద్దఎత్తున ఆ సంస్థ ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే వేగంగా ఉద్యోగాలు వస్తాయని యువత గంపెడాశ పెట్టుకున్నారు. రాష్ట్రం సైతం అన్ని రంగాల్లో ముందుకెళుతుంది. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏపీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనివర్సిటీని నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి తొలి అడుగుపడిరది. అమెరికా చిప్‌ మేకర్‌ ఎన్విడియాతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ దిశగా పనులు వేగంగా జరిగితే దేశంలో తొలి ఏఐ యూనివర్సిటీకి అమరావతి కేరాఫ్‌గా మారనుంది. ఈ ఒప్పందం ప్రకారం రానున్న రెండేళ్లలో 10 వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఏఐ శిక్షణ లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే విధంగా ఏఐ స్టార్టప్‌లకు ఆ సంస్థ సహకారం అందించనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు