ముంబయి: అత్యంత ఉత్సాహభరితమైన గణిత అభ్యాసకుని నుండి అసాధారణ గణిత మేధావికి ప్రయాణం కేవలం ఒక శిబిరం దూరంలో ఉంది. ఈ వేసవిలో, ఎప్సిలాన్ ఇండియా క్యాంప్ 9 నుండి 13 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం గణితాన్ని సరదాగా, ఆసక్తికరంగా నేర్చుకోవడానికి ఒక అద్భుతమైద అవకాశాన్ని అందించడానికి సమ్మర్ క్యాంప్తో తిరిగి వస్తుంది. రైజింగ్ ఎ మ్యాథమెటీషియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎప్సిలాన్ ఇండియా ఒక రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంప్. ఇది వ్యక్తిగత, సామాజిక అభివృద్ధిని కలిపి, అధునాతన గణిత విద్య ద్వారా గణితశాస్త్రంలో ప్రతిభావంతులైన విద్యార్థులను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్సిలాన్ యూఎస్ఏ, మ్యాథ్పాత్, మరియు మ్యాథ్క్యాంప్ల వ్యవస్థాపకుడు, ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ జార్జ్. థామస్ 2011లో యూఎస్ఏలో స్థాపించిన గౌరవనీయమైన ఎప్సిలాన్ క్యాంప్ నుంచి ఎప్సిలాన్ ఇండియా ప్రేరణ పొందింది.