38 మంది మృతి… అనేకమందికి తీవ్ర గాయాలు
గాజా : గాజాలో ఇజ్రాయిల్ మారణహోమం సృష్టిస్తోంది. గాజాలోని అనేక ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. గాజాలోని నివాస ప్రాంతాలు, ఆసుపత్రులపై విరుచుకుపడు తోంది. తాజాగా ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 38 మంది పలస్తీనియన్లు మృతిచెందారని, అనేకమంది గాయాలపా లైనట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 55 వేల మందికిపైగా మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సుమారు 1,24,901 మంది గాయపడినట్లు పేర్కొంది. హమాస్ను అంతమొందించి వారి చెరలో ఉన్న బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్ సేనలు చెబుతున్నాయి. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అప్పటవరకు వెనుకడుగు వేయబోమని తెలిపారు.