ముంబయి : ఫోన్పే అక్షయ తృతీయ సందర్భంగా 24క్యారెట్ డిజిటల్ గోల్డ్పై అద్భుతమైన క్యాష్బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఫోన్పే ప్లాట్ఫామ్లో కనీసం రూ.2000 విలువైన డిజిటల్ గోల్డ్ను కొనుగోలు చేసిన యూజర్లకు ఫ్లాట్ 1% క్యాష్బ్యాక్ (రూ.2000 వరకు) లభిస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30న చేసే వన్-టైమ్ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది(ఒక యూజర్కు ఒక్కసారే లభిస్తుంది). యూజర్లు యూపీఐ, యూపీఐ లైట్, క్రెడిట్, డెబిట్ కార్డ్లు, వాలెట్, ఇంకా గిఫ్ట్ కార్డ్లు వంటి పలు పేమెంట్ పద్ధతుల ద్వారా పే చేయవచ్చు. ఈ సందర్భంగ క్యారట్లేన్ స్టోర్లు, వెబ్సైట్లో ఉన్న డిజిటల్ గోల్డ్ను వెనక్కి తీసుకున్నా (రిడీమ్ చేస్తున్నా) కూడా ఫోన్పే ప్రత్యేక ఆఫర్ను అందిస్తోంది.