భారత్రష్యా బిజినెస్ ఫోరంలో పుతిన్
మాస్కో: భారత్, రష్యా మధ్య ఆర్థిక బంధం మరింత బలోపేతం కావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆకాంక్షించారు. తమ రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు దీర్ఘకాలంగా ఉన్నాయని, ఇవి ఇంకా బలపడాలని కోరుకుంటున్నట్లు ‘ఇండి యా
రష్యా బిజినెస్ ఫోరం’లో అన్నారు. దీర్ఘకాలిక సహకారానికి సంబందించిన తమ కార్యాచరణ ప్రణా ళికను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు వెల్లడిరచారు. 2030 వరకు భారత్`రష్యా మధ్య సహకారానికి ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. చమురు, గ్యాస్ ఎగుమతులు పెంచే లక్ష్యంతో వాణిజ్యపరమైన అడ్డంగులను తొలగిస్తూ ముందుకు వెళుతున్నట్లు పుతిన్ చెప్పారు.
పెట్టుబడిపరంగానూ సహకారాన్ని పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడిరచారు. భారత్-రష్యా మధ్య ఆర్థిక సంబంధాలు, సహకారం పెంచేందుకు నూతన మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. రవాణా, మౌలిక వసతులు, రైల్వే ఆధునికీకరణ, సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు వంటి రంగాలలో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టిని కేంద్రీకరించినట్లు వెల్లడిరచారు.