ఇరాన్కు జేడీ వాన్స్ హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్ అణ్వస్త్రాల జోలికి వెళితే తీవ్ర పరిణామాలు తప్పబోవని అమెరికా బెదిరించింది. ఆ దేశంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయని, ప్రస్తుతం 400 కిలోల యురేనియం జాడలేదని, దాంతో 10 అణు బాంబులు తయారు చేయొచ్చని వాదిస్తోంది. తాజాగా ఇజ్రాయిల్`ఇరాన్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించినప్పటికీ ఉల్లంఘనలపై పరస్పరం ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల క్రమంలో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ‘బంకర్ బస్టర్’ దాడుల తర్వాత 400 కిలోల శుద్దిచేసిన యురేనియం కనిపించకుండా పోయిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడిరచారు. ఈ యురేనియం 60శాతం శుద్ధి చేసింది… అణ్వాయుధంగా మారేందుకు 90శాతం శద్ధీకరణ జరగాలన్నారు. అమెరికా వైమానిక దాడులతో ఇరాన్ అణు సామర్థ్యాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిందని వాన్స్ చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా తుడిచిపెట్టినట్లు ప్రకటించారు. ఇరాన్ ప్రస్తుతం అణ్వస్త్రాలు తయారు చేసే స్థితిలో లేదన్నారు. అణ్వాయుధాల జోలికి వెళితే శక్తిమంతమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ను వాన్స్ హెచ్చరించారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం శిథిలం చేయడమే అమెరరికా లక్ష్యమని అన్నారు. శుద్ధి చేసిన యురేనియంతో ఇరాన్ అణ్వాయుధం తయారు చేయగలదని తెలిపారు. 400 కేజీల యురేనియం చిన్న కంటైనర్లు, కార్లలో తరలించవచ్చని అంటున్నారు. అయితే అమెరికా దాడులకు ముందు ఫోర్దో అణు కేంద్రం వద్ద 16 ట్రక్కులు ఆగివుండటం, దాడుల తర్వాత అవి అక్కడ లేకపోవడం ఉపగ్రహ చిత్రాల్లో తెలుస్తోంది. పర్వత ప్రాంతంలో ఈ అణు కేంద్రం ఉండటం, సాధారణ క్షిపణులు చేరుకోలేకపోవడం వల్ల దానిపై స్పిరిట్ బాంబర్లతో బంకర్ బస్తర్లతో అమెరికా దాడి చేసింది. తీవ్ర విధ్వంసం సృష్టించింది. కాగా, దాడికి ముందే అణు కేంద్రం నుంచి యురేనియం తరలించినట్లు ఇరాన్ పేర్కొంది.
మళ్లీ అణ్వస్త్రాల జోలికి వెళ్లారో…
RELATED ARTICLES