. ఇజ్రాయిల్` ఇరాన్ యుద్ధం శాంతికి విఘాతం
. ప్రధాని మోదీ వైఖరి వెల్లడిరచాలి
. విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. రాష్ట్రవ్యాప్తంగా పలస్తీనా సంఫీుభావ ప్రదర్శనలు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి /విజయవాడ: ఇజ్రాయిల్
ఇరాన్ యుద్ధంతో ప్రపంచంలో అత్యంత ప్రమాకరమైన పరిస్ధితులు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పలస్తీనా ప్రజలకు సంఫీుభావంగా సీపీఐ, సీపీయం, ఇతర వామపక్ష పార్టీల దేశవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించారు. దీనిలో భాగంగా విజయవాడ ధర్నాచౌక్ వద్ద సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన సంఫీుభావ సదస్సులో రామకృష్ణ ప్రసంగించారు. అమాయక ప్రజలపై యుద్ధోనాద్మంతో పేట్రేగిపోవడం ప్రపంచ శాంతికి విఘాతం కలిగించడమేనని స్పష్టం చేశారు. యుద్ధ నేపథ్యంతో ఇరాన్లో చదువుతున్న మన దేశ విద్యార్థులు ప్రమాదంలో ఉన్నారని, వారిని తక్షణమే మన దేశానికి రప్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఇప్పటికే మన విద్యార్థులకు సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచనలు చేసినట్లు తెలుస్తోందన్నారు. ఈ పరిస్థితిలో అమెరికా ఎంబసీ కూడా పూర్తిగా ఖాళీ చేసి వెళ్తుతుందన్నారు. కెనడాలో జరుగుతున్న జీ7 సమావేశంలో ఉన్న ట్రంప్ కూడా అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించుకుని తన దేశానికి తిరిగి వెళ్లిపోవడంతో యుద్ధ పరిస్థితులు ఏ స్ధాయిలో ఉన్నాయో తెలుస్తోందన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంతో చెలరేగిపోవడమేనన్నారు. ముందునుండి బలపరుస్తున్న అమెరికాయే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ను అమెరికా గుడ్డిగా బలపరచడం వలన ఇవాళ విచ్చలవిడిగా గాజా ప్రాంతాన్ని నాశనం చేశారని అన్నారు. పలస్తీనా దేశాన్ని కూడా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని, ఆ తరువాత ఇరాన్పై యుద్ధం చేస్తున్నారని తెలిపారు. తెహ్రాన్పై ప్రత్యక్షంగాను, పరోక్షంగా దాడులు చేసి అమాయక ప్రజలతో పాటు అనేకమంది శాస్త్రవేత్తలను టార్గెట్ చేసి చంపివేశారన్నారు. దీంతో భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో అన్ని వామపక్ష పార్టీల అధ్వర్యాన శాంతియుతంగా పలస్తీనీయులకు సంఫీుభావం తెలియజేస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దీనిపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ గట్టిగా మాట్లాడే మోదీ... ట్రంప్ను చూస్తే మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. భారత్
పాకిస్థాన్ ఘర్షణ విషయంలోనూ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మోదీ సర్కారు చర్యలను బలపరిచాయని గుర్తు చేశారు. అయితే యుద్ధం ఎవరిని అడిగి ఆపారో నేటికీ సమాధానం లేదన్నారు. యుద్ధం వెంటనే ఆపాలని హెచ్చరిక చేయడంతోనే యుద్ధం ఆగిందని ట్రంప్ సగర్వంగా ప్రకటించకుంటున్నారని, దీనికి ఇంతవరకు మోదీ వివరణ ఇవ్వలేదన్నారు. నాటి మహాత్మాగాంధీ కాలం నుండి పలస్తీనాకు మనం మద్దతుగా ఉన్నామని, గాంధీ ఆశయాలను నెరవేర్చే పద్ధతుల్లో మన దేశ విదేశాంగ వైఖరి ఉండాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ వామపక్ష పార్టీలన్నీ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయని, రాబోయే రోజుల్లో ప్రపంచం యుద్ధాన్మోదం వైపు మరలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పి.ప్రసాద్, సీపీఐ (ఎంఎల్) నాయకులు జాస్తి కిషోర్ బాబు, ఎస్యూసీఐ నాయకులు అమర్నాథ్ తదితరులు ప్రసంగించారు. సంఫీుభావ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, నాయకులు బుట్టి రాయప్ప, కేవీ భాస్కర్రావు, తాడి పైడయ్య, పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు, అప్పరబోతు రాము, సీపీఎం నాయకులు టి.రమణ, బోయ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో
గుంటూరు పాతబస్టాండ్ సెంటర్ వద్ద పలస్తీనా సంఫీుభావ దినోత్సవ కార్యక్రమం జరిగింది. సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్, సీపీఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్, సీపీఐ ఎంఎల్ రెడ్స్టార్ పొలిట్ బ్యూరో సభ్యులు మన్నవ హరిప్రసాద్ మాట్లాడారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో
పలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని జాంపేట ఆజాద్ చౌక్ సెంటర్ వద్ద ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రదర్శన చేశారు. జిల్లా నాయకులు పవన్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు చీకట్ల వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో
ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ), ఎంసీపీఐ (యు)అధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా, పలస్తీనాకు సంఫీుభావంగా నినాదాలు చేశారు. సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్.లింగరాజు, సీపీఐ ఎంఎల్(న్యూ డెమోక్రసీ) జిల్లా నాయకులు కేవీ రమణ, ఎంసీపీఐ (యు) జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.