Tuesday, April 15, 2025
Homeఆంధ్రప్రదేశ్శివాలయ నిర్మాణమునకు బండి వేణుగోపాల్ దంపతులు విరాళం..

శివాలయ నిర్మాణమునకు బండి వేణుగోపాల్ దంపతులు విరాళం..

శ్రీ షిరిడి సాయి సేవా సమితి అధ్యక్షులు వీరనారాయణ.
విశాలాంధ్ర ధర్మవరంబీబీ పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు సత్యసాయి నగర్ లో గల శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో నూతనంగా శివాలయం ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. ఈ ఆలయ నిర్మాణం పట్ల పలువురు దాతలు ఆలయానికి తమ సహాయ సహకారాలలో భాగంగా భక్తిగా, భక్తులుగా విరాళాలని ఇస్తున్నారు. ఇందులో భాగంగా శివాలయ నిర్మాణమునకు దాతలైన బండి వేణుగోపాల్, భార్య లక్ష్మీదేవి దంపతులు తమ వంతుగా రూ.25,000 రూపాయలను విరాళంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వీరనారాయణ ,కార్యదర్శి రామలింగయ్య, డైరెక్టర్ సూర్య ప్రకాష్ కు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ వారు దంపతుల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి, వారిని ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు