Homeవ్యాపారంఅవకాశాలను అందిపుచ్చుకోవడమే బంధన్ కాంట్రా ఫండ్ లక్ష్యం

అవకాశాలను అందిపుచ్చుకోవడమే బంధన్ కాంట్రా ఫండ్ లక్ష్యం

- Advertisement -

హైదరాబాద్: విరుద్ధమైన పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ పథకమైన బంధన్ కాంట్రా ఫండ్‌ను ప్రారంభించినట్లు బంధన్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఆందోళనలు, చక్రీయ సవాళ్లు, స్థూల ఆర్థిక అనిశ్చితులు లేదా ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్ కారణంగా తాత్కాలికంగా ప్రాధాన్యత కోల్పోయిన, ప్రాథమికంగా బలమైన వ్యాపారాలను గుర్తించడమే ఈ ఫండ్ లక్ష్యం. కాలక్రమేణా అభిప్రాయాలు, మౌలిక అంశాలు మెరుగుపడినప్పుడు, వీటికి రీ-రేటింగ్ పొందే అవకాశం ఉంటుంది. న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ ఎఫ్ ఓ) ఆగస్టు 10, సోమవారం నాడు ప్రారంభమై, ఆగస్టు 24, సోమవారం నాడు ముగుస్తుంది. బంధన్ కాంట్రా ఫండ్‌లో లైసెన్స్‌ పొందిన మ్యూచువల్ ఫండ్ పంపిణీదారుల ద్వారా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా, నేరుగా వెబ్ సైట్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. బంధన్ ఏఎంసీ సీఈఓ విశాల్ కపూర్ మాట్లాడుతూ, వివిధ రంగాలలో వాల్యుయేషన్ అంతరం గణనీయంగా పెరిగి, ఎంపిక చేసిన కాంట్రేరియన్ పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తున్న తరుణంలో బంధన్ కాంట్రా ఫండ్ ప్రారంభించబడింది. పటిష్టమైన వ్యాపార నమూనాలు, మెరుగుపడుతున్న ఆదాయాల స్పష్టత, బలపడుతున్న బ్యాలెన్స్‌ షీట్లు ఉన్నప్పటికీ, అనేక రంగాలు, కంపెనీలు తమ దీర్ఘకాలిక సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయనీ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు