Homeఅంతర్జాతీయంషేక్ హసీనా కోసం దౌత్య కసరత్తు

షేక్ హసీనా కోసం దౌత్య కసరత్తు

- Advertisement -

బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి షమా ఇస్లాం
లొంగిపోయేందుకు సిద్ధమే: షేక్ హసీనా

ఢాకా: మాజీ ప్రధాని షేక్ హసీనాను దేశానికి తిరిగి తీసుకొచ్చి, విచారించేందుకుగాను బంగ్లాదేశ్ ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తున్నదని అక్కడి విదేశాంగ మంత్రి షామా ఒబైద్ ఇస్లాం అన్నారు. దౌత్య కసరత్తులో ఎలాంటి లోపాలు లేవని ఆమె చెప్పారు. ఇలాంటి పనులకు సమయం పడుతుందన్నారు. తనపై చర్యలకు రాజకీయ కుట్ర జరుగుతున్నదని షేక్ హసీనా చేస్తున్న ఆరోపణలపై షమా స్పందిస్తూ పలాయనం సాగించిన నేరస్తుల మాటలకు విలువ ఉండదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత న్యాయ`దౌత్య ప్రక్రియకు వాటితో సంబంధం లేదని అన్నారు. విద్యార్థి ఉద్యమంతో గద్దె దిగిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలావుంటే అరెస్టుకు, చావుకు భయ పడను అంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్ హసీనా ఉద్ఘాటించారు. కోర్టు ఎదుట లొంగిపోయేందుకు సిద్ధమేనని, బంగ్లాదేశ్‌కు తిరిగి వెళతానని చెప్పారు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ యంత్రాంగంతో సంప్రదింపులు జరపలేదన్నారు. ‘బంగ్లాదేశ్ నా దేశం. తప్పకుండా వెళతాను. అక్కడ నన్ను అరెస్టు చేయొచ్చు. చంపేయవచ్చు. అందుకు నేను భయపడను. నాకు నా పార్టీ నాయకులు, కార్యకర్తల విషయంలో బాధ్యత ఉంది. వాళ్లు అక్కడ అణచివేతకు గురవుతున్నారు. కాబట్టి నేను వెళ్లాలి. అది నా సొంతదేశం, నా తల్లిదండ్రులను సమాధి చేసిన చోటు. నేను ఆ మట్టిలోనే కలిసిపోవాలని కోరుకుంటున్నా’ అని షేక్ హసీనా అన్నారు. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న అవామీ లీగ్ సీనియర్ నాయకులతో కలిసి డిసెంబరులో బంగ్లాదేశ్ వెళ్లబోతున్నట్లు ప్రకటించారు. తనను అప్పిగించే విషయమై భారత్, బంగ్లాదేశ్ అధికారులకు లేఖలు రాస్తున్నట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాపై అనేక కేసులు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రిబ్యునల్ 2025లో ఆమెకు మరణశిక్ష విధించింది. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను ఇప్పటికే అనేకసార్లు కోరింది. న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. కాగా డిసెంబరులో బంగ్లాదేశ్ వెళతామని తాజా ఇంటర్వ్యూలో షేక్ హసీనా చెప్పడంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు