దేశీయ భాషలపై ప్రేమ కాదు… హిందీని ఆపాదించే యత్నం
ఆంగ్లంపై అమిత్షా వ్యాఖ్యలకు సీపీఐ ఖండన
న్యూదిల్లీ : బీజేపీ భాషసాంస్కృతికపరమైన ఆధిపత్యాన్ని కోరుకుంటోందని, ఆ పార్టీకి భారతీయ భాషలపై ప్రేమ లేదని, హిందీని రుద్దేందుకు యత్నిస్తోందని సీపీఐ విమర్శించింది. ఆంగ్ల భాషపై కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచింది. ఆంగ్లం మాట్లాడేందుకు సిగ్గుపడే రోజు వస్తుందన్న కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలను సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎంపీ సంతోశ్ కుమార్ శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో దుయ్యబట్టారు. అమిత్ షా మాటలతో జాతీయ భాషగా హిందీని ఆపాదించడానికి, ఆర్ఎస్ఎస్
బీజేపీ ఏకపక్ష అజెండా అమలు దిశగా జరుగుతున్న ప్రయత్నం స్పష్టమవుతోందన్నారు. ‘ఆంగ్లమన్నది బ్రిటిష్ వాళ్ల ద్వారా భారత్కు వచ్చినప్పటికీ అది ప్రాంతాలను కలుపుతుంది. స్వాతంత్య్ర సమరంలో ఐక్యతకు దోహదమైంది. కులం, వర్గం, ప్రాంతాలకు అతీతంగా లక్షలాది మందికి సాధికారికత చేకూర్చింది. ఈ భాష మాట్లాడటం సిగ్గుచేటు అనడం భారత యువత, శ్రామిక వర్గ ఆశలను చంపేయడమే’ అని రాజా వ్యాఖ్యానించారు. అమిత్షా మాటలు ఆంగ్లంపైనే దాడి కాదని, సంఫ్ు పరివార్ హిందీహిందూ
హిందూస్థాన్ వర్షన్కు అనుకూలంగా లేని ప్రతి ఒక్క భాషపై దాడి అని వక్కాణించారు. భాష అనేది సాధికారికతకు మాధ్యమమే తప్ప ఆధిపత్యానికి, అవమానానికి కాదని అన్నారు. ఇటువంటి బెదిరింపులను తీవ్రంగా ఖండిరచాలని రాజా పిలుపునిచ్చారు. దేశంలోని భాషా వైవిధ్యతను దెబ్బతీసి, సాంస్కృతిక ఆధిపత్యం కోసం ఆర్ఎస్ఎస్బీజేపీ ప్రయత్నాలకు అమిత్షా మాటలు అద్దం పట్టినట్లు సంతోశ్ కుమార్ వ్యాఖ్యానించారు. భారత్కు లింక్ లాంగ్వేజ్గా ఆంగ్లం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్య, ఉద్యోగావకాశాలకు ద్వారాలు తెరుస్తున్నదన్నారు. ఇలాంటి భాషపై దాడి చేయడమంటే యువకులు, అణగారిన వర్గాల ఆకాంక్షలను దెబ్బతీయడమేనని సంతోశ్ కుమార్ అన్నారు. ఆంగ్లం స్థానాన్ని హిందీతో భర్తీ చేసి సాంస్కృతిక
భాషాపరమైన ఆధిపత్యాన్ని పొందాలనే ఆర్ఎస్ఎస్ ప్రాజెక్టుకు అనుగుణంగా అమిత్షా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. బీజేపీకి కావాల్సినది భిన్నత్వంలో ఏకత్వం కాదు… తాము ఆపాదించే ఏకరూపత అని ఎంపీ దుయ్యబట్టారు. ‘ఇది ఆంగ్ల భాషపై మాత్రమే దాడి కాదు. హిందీహిందూ
హిందూస్థాన్ అనే సంఫ్ు విజన్కు అనుకూలం కానీ తమిళం, మలయాళం, బెంగాలీ, తెలుగు వంటి ప్రతి ప్రాంతీయ భాషపై ప్రత్యక్ష దాడి’ అని అన్నారు. సాధికారికతకు భాష మార్గమని, సైద్ధాంతిక నియంత్రణకు మాధ్యమం కాదన్నారు. సాంస్కృతికపరమైన ఆధిపత్యం కోసం హిందీ భాషను రద్దే ప్రయత్నాలను సీపీఐ బలంగా అడ్డుకుంటుందని సంతోశ్ కుమార్ వెల్లడిరచారు.