. రూ.1329 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్లు
. రూ.1458 కోట్లతో కామన్ సెక్రటేరియట్ నిర్మాణం
. కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం వెల్లడి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడిరది. 2018 నుంచి పెండిరగులో ఉన్న రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.2,787 కోట్లతో నిర్మించే రెండు ప్రాజెక్టులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అందులో రూ.1,329 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ నిర్మాణం చేపట్టనుండగా, మరో రూ.1,458 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణాలు జరగనున్నాయి. ఈ ప్రాజెక్టులను సీపీడబ్ల్యూడీ నిర్మిస్తుందని కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం మెమోరాండం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడిరచారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంస్థలకు గత టీడీపీ ప్రభుత్వంలో భూములు కేటాయింపులు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి నిర్మాణ పనులు నిలిపివేయడంతో ఆ సంస్థలన్నీ వెనక్కి తగ్గాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించింది. కీలకమైన సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటి ఐకానిక్ ప్రాజెక్టులతో పాటు రహదారులు, ఐఏఎస్, ఐపీఎస్, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు సంబంధించిన భవనాల పనులు, రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి దాదాపు రూ.35 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచి… కొన్ని ప్రాజెక్టుల పనులు ప్రారంభించారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వాటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి… గతంలో భూముల కేటాయింపులు పూర్తయిన అన్ని సంస్థలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నది.