Saturday, June 21, 2025
Homeఆగేదే లేదు

ఆగేదే లేదు

ఇజ్రాయిల్‌`ఇరాన్‌ మధ్య భీకర దాడులు
. రెండువైపుల నుంచి విరుచుకుపడుతున్న క్షిపణులు
. పేలుళ్లతో దద్దరిల్లిన జెరూసలెం, టెల్‌అవీవ్‌
. అమెరికా యుద్ధంలోకి దిగితే అందరికీ ముప్పు: ఇరాన్‌
. ముగ్గురు ఇరాన్‌ కమాండర్లను మట్టుబెట్టాం: ఇజ్రాయిల్‌

తెహ్రాన్‌/టెల్‌అవీవ్‌ : ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల మధ్య యుద్ధం తొమ్మిదో రోజైన శనివారం మరింత భీకరంగా, విస్తృతంగా సాగింది. రెండు దేశాల్లో ఏ ఒక్కటీ ఆగే పరిస్థితి లేదు. ఢీ అంటే ఢీ అంటూ దాడులు` ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. అణు ముప్పు తొలగిపోయేంత వరకు మా దాడులు ఆగవని ఇజ్రాయిల్‌ ప్రకటిం చింది. దీర్ఘకాలం పోరునకు సంసిద్ధం కావాలని తమ సైన్యానికి ఇజ్రాయిల్‌ మిలటరీ చీఫ్‌ ఈయల్‌ జమీర్‌ సూచించారు. అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థ ఐరస్‌ డోమ్‌ ఉన్నప్పటికీ ఇరాన్‌ వరుస క్షిపణి దాడులతో టెల్‌ అవీవ్‌ దద్దరిల్లిపోతోంది. శనివారం దాడుల తీవ్రతను ఇరాన్‌ పెంచింది. జెరూసలేం, టెల్‌అవీవ్‌ తదితర కీలక నగరాల్లో బాంబు పేలుళ్ల శబ్దాలు, సైరన్లు వినిపించాయి. ఇజ్రాయిల్‌ కూడా ఇరాన్‌లోని నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, ఆయుధగారాలపై దాడులు సాగించింది. ఇరాన్‌లోని కీలక అణు కేంద్రం ఇష్ఫాహన్‌తో పాటు అనేక లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపింది. ముగ్గురు కమాండర్లను హతమార్చింది. ఖౌమ్‌ ప్రాంతంలో వైమానిక దాడుల్లో పలస్తీనా కార్ప్సొ ఆఫ్‌ ది ఖుర్ద్స్‌ ఫోరెన్స్‌ కమాండర్‌, ఇరాన్‌ ప్రభుత్వానికి హమాస్‌కు మధ్య కీలక సమన్వయకర్త సయీద్‌ ఇజాదీని చంపినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం (ఐడీఎఫ్‌) ప్రకటించింది. మరో ఇద్దరు కమాండర్లు బెహ్నామ్‌ సప్‌ారియారి, అమీన్‌పూర్‌ జుదాకీని హతమార్చామని ఒక ప్రకటన చేసింది. అయితే ఖొర్రమాబాద్‌పై దాడుల్లో ఐదుగురిని కోల్పోయినట్లు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ వెల్లడిరచింది. ఇరాన్‌ఇజ్రాయిల్‌ పరస్పర దాడులతో ఆయా దేశాల్లోని విదేశీయులు, దౌత్య సిబ్బంది తమ దేశాలకు తరలిపోతున్నారు. అందుకోసం ఆయా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇరాన్‌ తాజా దాడులతో సెంట్రల్‌ ఇజ్రాయిల్‌లోని హోలన్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఇరాన్‌లోని నివాస ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో ఎమర్జెన్సీ కేంద్రాలు, సహాయ సామ్రాగికి నష్టం వాటిల్లింది. అత్యవసర సేవలు అందించే సంస్థలో పనిచేసే 14 మంది సభ్యులు తీవ్రంగా గాయపడ్డారని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మూడు సహాయక కేంద్రాలు, ఎనిమిది అంబులెన్సులు బాగా దెబ్బతిన్నాయని సంబంధిత అధికారి జాఫర్‌ వెల్లడిరచారు. ఇరాన్‌, ఫార్స్‌ ప్రావిన్స్‌లోని షిరాజ్‌ నగరంలోగల సైనిక స్థావరంపై ఇజ్రాయిల్‌ దాడి చేసినట్లు ఐఎస్‌ఎన్‌ఏ వార్తాసంస్థ వెల్లడిరచింది. అణు శాస్త్రవేత్త ఇసార్‌ తబాతబై, ఆయన భార్య ప్రాణాలు కోల్పోయినట్లు మెహర్‌ వార్తా సంస్థ నివేదించింది. ఇప్పటివరకు ఆరుగురు అగ్రస్థాయి అణు శాస్త్రవేత్తలు చనిపోయిన విషయం తెలిసిందే. ఈనెల 13 నుంచి ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇరాన్‌ పౌరులు 430 మంది చనిపోగా, 3,500 మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా నటన్జ్‌ అణు కేంద్రంలో రేడియోలాజికల్‌ రసాయన కాలుష్యం ముప్పు ఉన్నట్లు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) హెచ్చరించింది.
అమెరికా దిగితే ముప్పు: అరాగ్చీ
ఇజ్రాయిల్‌ దురాక్రమణకు మద్దతుగా అమెరికా దిగితే అందరికీ ప్రమాదమని ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ హెచ్చరించారు. ఒకవైపు దాడులు చేస్తూ, మరోవైపు చర్చలకు రమ్మనడం తీవ్రంగా ఆక్షేపణీయమని, దాడుల వేళ చర్చలకు తావులేదని అమెరికా తీరును ఖండిరచారు. దౌత్యపరమైన చర్చల విషయంలో అమెరికాను ఇరాన్‌ నమ్మడం కష్టమేనని అరాగ్చీ అన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడని కారణంగా అమెరికాపై నమ్మకం సడలిందన్నారు.
ఇజ్రాయిల్‌ను ఆపడం కష్టమే: ట్రంప్‌
తమ సహాయం లేకుండా ఇరాన్‌లోని ఫోర్డ్‌ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయిల్‌కు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఏకపక్షంగా దాడి చేసినా పెద్దగా ఫలితం ఉండదన్నారు. దౌత్యానికి సిద్ధమని ప్రకటించారు. అయితే ఇరాన్‌పై దాడి చేయకుండా ఇజ్రాయిల్‌ను ఆపడం కష్టమేనని చెప్పారు.
ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చెప్పలేమన్నారు. ఇజ్రాయిల్‌ అద్భుతంగా దాడులు సాగిస్తోందని, ఇరాన్‌ దాడులు పేలవంగా ఉన్నాయన్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్‌ఇరాన్‌ మధ్య దౌత్యానికి యూరోపియన్‌ దేశాల మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఆ ప్రయత్నాలు ఫలించవన్నారు. యూరప్‌తో మాట్లాడేందుకు ఇరాన్‌ ఇష్టపడదని చెప్పారు. తనకు శాంతి కావాలన్నారు. ఇదే క్రమంలో ఇరాన్‌పై సుదీర్ఘ దాడుల ప్రణాళికలపై అత్యున్నత సైనికాధికారులతో ట్రంప్‌ సమీక్ష నిర్వహించారు. జాయింట్‌ చీఫ్స్‌ ఛైర్మన్‌ జనరల్‌ డాన్‌ కైన్‌, సెంట్రల్‌ కమాండ్‌ చీఫ్‌ జనరల్‌ మైకేల్‌ కురిల్లాను కలిశారు. పూర్తి సన్నద్ధత, వ్యూహాత్మక ప్రణాళికపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాదేశిక శాంతికి నెతన్యాహు ఆటంకం: ఎర్దోగన్‌ ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రాదేశిక శాంతికి భారీ ఆటంకం అని టర్కీ ప్రధాని తయ్యిప్‌ ఎర్దోగన్‌ మండిపడ్డారు. అమెరికా, ఇరాన్‌ మధ్య అణు చర్చలకు విఘాతం కలిగించడమే ఇజ్రాయిల్‌ లక్ష్యమన్నారు. ఈ దాడులతో దౌత్యంపై ఆసక్తి లేదని స్పష్టం చేసిందని అన్నారు. ఇజ్రాయిల్‌ చిమ్మే విషాన్ని...విష ప్రచారాన్ని విస్మరించాలని... దౌత్యపరమైన పరిష్కారం కోసం ఒత్తిడి తేవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అందుకు ఆధారాల్లేవు: పుతిన్‌ ఇరాన్‌ అణ్వస్త్రాలు తయారు చేస్తున్నదని, వాటిని కలిగివుందని చెప్పేందుకు ఆధారాలు లేవని రష్యా నొక్కిచెప్పింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం చెప్పారు. ‘అణ్వస్త్రాలను పొందేందుకు ఇరాన్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు రష్యా వద్దగానీ ఐఏఈఏ వద్దగానీ లేవు. ఇజ్రాయిల్‌కూ ఆధారాలు లభించే అవకాశం లేదు. మేము ఇప్పటికే చాలాసార్లు ఈ విషయం చెప్పాం’ అని పుతిన్‌ అన్నారు. శాంతియుత అణు కార్యక్రమం కోసం ఇరాన్‌కు మద్దతు ఇవ్వడం కోసం రష్యా సిద్ధమన్నారు. అలా చేసేందుకు రష్యాకు హక్కు ఉందని అన్నారు. ఇరాన్‌ఇజ్రాయిల్‌ మధ్య రక్తపాతాన్ని ఆపేందుకు తమ వంతు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు