Monday, June 9, 2025
Homeఆర్‌ఎస్‌ఎస్‌ నుంచిదేశభక్తి నేర్చుకోవడమా?

ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచిదేశభక్తి నేర్చుకోవడమా?

. స్వాతంత్య్రోద్యమంలో వారి పాత్ర ఏమిటి?
. కేరళ గవర్నర్‌కు భరతమాత ఎవరో చెప్పాలి
. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

న్యూదిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి దేశభక్తి నేర్చుకోవలసిన అవసరం తమ పార్టీకి లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా నొక్కి చెప్పారు. కేరళ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ తన భారత మాత ఎవరో స్పష్టం చేయాలన్నారు. తిరువనంతపురంలోని రాజ్‌ భవన్‌లో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) శాఖలతో సంబంధం కలిగి ఉన్న భారత మాత చిత్రపటాన్ని ఉపయోగించిన తర్వాత వివాదం చెలరేగింది. దీని ఫలితంగా సీపీఐ నాయకుడు, కేరళ మంత్రి పి.ప్రసాద్‌ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. కేరళలోని అధికార వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్‌) లో సీపీఐ రెండవ అతిపెద్ద పార్టీ. ‘కేరళ గవర్నర్‌ భారత మాత గురించి, త్రివర్ణ పతాకం గురించి ఏమి అర్థం చేసుకున్నారో నాకు తెలియదు…. నేను పార్లమెంటులో కూడా ఈ అంశాన్ని లేవనెత్తాను…. మీ భారత మాత ఎవరు? దయచేసి మాకు చెప్పండి’ అని రాజా పీటీఐకి చెప్పారు. ‘మన భరతమాత వ్యవసాయ రంగంలో పని చేస్తున్నారు. మన భరతమాత అడవుల్లో పనిచేస్తూ, జల్‌-జమీన్‌-అడవిని కాపాడుతోంది. మన భరతమాత పాఠశాలల్లో, కార్యాలయాల్లో, కర్మాగారాల్లో పని చేస్తోంది. మన భరతమాత సైన్యం, రక్షణ దళాలలో పని చేస్తోంది. మీ భరతమాత ఎవరు? వారికి స్పష్టంగా తెలియదు’ అని అన్నారు. ‘వారు (బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌) భారతమాత లేదా త్రివర్ణ పతాకంకు సంబంధించి ఏకైక యజమానులమని భావిస్తున్నారు. వారు ఈ దేశ స్వాతంత్య్రం కోసం ఎప్పుడూ పోరాడలేదు. వలస పాలన నుంచి దేశ స్వాతంత్య్రం కోసం సీపీఐ పోరాడిరది. అత్యున్నత త్యాగాలు చేసింది…. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమి చేసింది?’ అని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఏ పాత్ర పోషించిందని రాజా ప్రశ్నించారు. సీపీఐ లాగే మితవాద సంస్థ కూడా 1925లో స్థాపించబడిరదని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘స్వాతంత్య్ర ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఏమిటి? భారతమాతను ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వచిస్తుందని వారు భావిస్తున్నారు?. గవర్నర్‌ల రాజ్‌ భవన్‌లు ఆర్‌ఎస్‌ఎస్‌ భవన్‌లు అని వారు భావిస్తున్నారా?’ అని ఆయన నిలదీశారు. ‘వారు మన జాతీయతను, మన దేశభక్తిని ప్రశ్నిస్తారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటం ఏమిటో, భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన త్యాగం ఏమిటో గవర్నర్‌కు తెలియదు’ అని ఆయన అన్నారు. రాజ్‌భవన్‌ పర్యావరణ దినోత్సవ కార్యక్రమానికి భారత మాత చిత్రపటాన్ని ఉపయోగించాలని నిర్ణయించినప్పుడు గొడవ ప్రారంభమయింది. ఫలితంగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రసాద్‌ దానిని బహిష్కరించారు. ఆ చిత్రపటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపయోగించిందని, రాజ్యాంగం లేదా భారత ప్రభుత్వం అధికారికంగా ఆమోదించలేదని ఆయన అన్నారు. ప్రసాద్‌ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన తర్వాత గవర్నర్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘ఏ ఒత్తిడి వచ్చినా, ఏ వర్గాల నుంచి వచ్చినా భారత మాతపై ఎటువంటి రాజీ ఉండదు’ అని అన్నారు. తదనంతరం, సీపీఐ శనివారం తన అన్ని శాఖలలో భారత మాత చిహ్నమైన జాతీయ జెండాను ఎగురవేసి, గవర్నర్‌ వైఖరికి నిరసనగా దాని ముందు మొక్కలు నాటుతామని ప్రకటించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు