Monday, June 23, 2025
Homeతెలంగాణ‘ఉపాధి’ పనిదినాలు రెట్టింపు కోసంకేంద్రాన్ని కోరతాం : మంత్రి సీతక్క

‘ఉపాధి’ పనిదినాలు రెట్టింపు కోసంకేంద్రాన్ని కోరతాం : మంత్రి సీతక్క

విశాలాంధ్ర-హైదరాబాద్‌ : గతంలో మాదిరిగా 12 కోట్ల పని దినాలు తెలంగాణకు కేటాయించా లని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సోమ వారం ఓ ప్రకటనలో తెలిపారు. పని దినాలు రెట్టింపు చేయాలని కోరినట్టు పేర్కొన్నారు. కేంద్రం నుంచి అనుమతులు వస్తాయన్న నమ్మకంతో ఉపాధి పనులను వేగవంతం చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 18.9 లక్షల కుటుంబాల్లోని 28.48 లక్షల మంది కూలీలకు పని కల్పించినట్టు వివరించారు. ఒక్కొ కుటుంబం సగటున 24 రోజుల పని దినాలను, 1,127 కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్నట్టు చెప్పారు. సగటున ఒక్కో కూలీకి రూ. 250.75 రోజువారి వేతనం లభిస్తుందన్నారు. రూ.307 దక్కెలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ కూలి గిట్టుబాటు అయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ అనుబంధ పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఉపాధి పనుల్లో 60 శాతం వ్యవసాయ అనుబంధ పనులు చేయించాలని లక్ష్యం పెట్టుకోగా… 50 శాతంగా నమోదయ్యాయన్నారు. మే మాసం ముగిసే నాటికి రూ. 1,416 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. కూలీల ఖాతాల్లో 733.52 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఉపాధి పనిదినాలను సగానికి కేంద్ర ప్రభుత్వం కుదించింది. దీనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ…కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సీతక్క లేఖ రాశారు. కాగా,రాష్ట్రంలో కేంద్రం కేటాయించిన ఆరున్నర కోట్ల పనిదినాల్లో ఇప్పటికే 4.53 కోట్ల పనిదినాలను పూర్తి చేసింది. అంటే పనిదినాల్లో 70 శాతం టార్గెట్‌ను చేరుకున్నట్లయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు