. రంగంలోకి అమెరికా
. ఇరాన్పై భీకర దాడులకు సమాయత్తం
. ప్రమాదకర జీబీయూ-57 బాంబుల ప్రయోగం?
. అణు స్థావరాలే లక్ష్యంగా దాడులకు సన్నాహాలు
. పశ్చిమాసియాలో విమానాశ్రయాల మూసివేత
. తెహ్రాన్ను వీడండి: భారత్, చైనా, సౌదీ అరేబియా హెచ్చరికలు
టెల్అవివ్/వాషింగ్టన్/తెహ్రాన్: ఇజ్రాయిల్ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. ఇరుదేశాలు మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు ఆందోళనగా ఉన్నారు. మరోవైపు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీయడానికి అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన జీబీయూ-57 ‘బంకర్ బస్టర్’ బాంబులను ప్రయోగించవచ్చనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇజ్రాయిల్
ఇరాన్ పోటాపోటీగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ7 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్ధాంతరంగా వైదొలగడం, తెహ్రాన్ ప్రజలు నగరాన్ని వీడాలని హెచ్చరికలు జారీ చేయడం, శ్వేతసౌధంలో ‘సిచ్యుయేషన్ రూమ్’ను సిద్ధం చేయించడం వంటి ట్రంప్ చర్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తున్నాయి. ఇరాన్ అణ్వస్త్ర దేశంగా మారడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, ఇరాన్ చేపడుతున్న అణుకార్యక్రమానికి నిజమైన ముగింపు ఉండాలని ఆయన చెప్పడం యుద్ధ భయాలను తీవ్రతరం చేస్తున్నాయి. ఏ క్షణమైనా అమెరికాఇజ్రాయిల్ ఇరాన్ అణస్థావరాలు లక్ష్యంగా భీకరదాడులు చేయవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా పశ్చిమాసియాలో అనేక దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే చైనా, భారత్, సౌదీ అరేబియా సహా అనేక దేశాలు తెహ్రాన్ నగరాన్ని వీడాలని తమ పౌరులకు అడ్వైజరీలు జారీ చేశాయి. దాడులు తీవ్ర రూపం మరోపక్క ఇరాన్
ఇజ్రాయిల్ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ గగనతల దాడులు చేస్తుండగా.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఐదో రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడిరది. అత్యంత కచ్చితత్వంతో మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడిరచింది. అంతేకాకుండా గ్లిలాట్లోని ఇజ్రాయిల్ మిలటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్పైనా క్షిపణి ప్రయోగించినట్లు తెలిపింది. ఇజ్రాయిల్ పక్కా ప్రణాళికలతో దాడులు చేస్తోందంటే… దానికి కారణం కచ్చితంగా మొస్సాద్ సంస్థే. ఇరాన్లో అణుస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి నుంచి.. కీలక అధికారులు, శాస్త్రవేత్తల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇజ్రాయిల్కు చేరవేసింది. అంతేకాకుండా ముందుగానే ఇరాన్కు భారీ మొత్తంలో డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించడం వెనుకా ఈ సంస్థ హస్తముంది. ఈ నేపథ్యంలోనే మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ క్షిపణి ప్రయోగించినట్లు తెలుస్తోంది. మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికాలకు సమాచారం ఇచ్చిన ఇరాన్.. దాడులు మాత్రం ఆపడం లేదు. ఇరుదేశాల మధ్య మొదలైన ఈ సంఘర్షణపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియని పరిస్థితులు కన్పిస్తున్నాయి. కాగా తెహ్రాన్లోని ఒక విమానాశ్రయంలో నిలిపి ఉంచిన రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలను ఇజ్రాయిల్ ధ్వంసం చేసింది. ఈ దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) విడుదల చేసింది. ఇజ్రాయిల్ విమానాలను అడ్డగించేందుకే ఈ ఎఫ్-14 జెట్లను అక్కడ ఉంచారని ఐడీఎఫ్ ఆరోపించింది. యుద్ధ విమానాలపై దాడులతో పాటు, ఇజ్రాయిల్పైకి డ్రోన్లను ప్రయోగించేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా విఫలం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. నిఘా వర్గాల సమాచారంతో, డ్రోన్ లాంచర్లు, ఆయుధాలను అమరుస్తున్న ఒక బృందాన్ని గుర్తించి, ప్రయోగానికి కొద్ది నిమిషాల ముందే వారిని మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడిరచింది.
బ్యాంకులపై సైబర్ దాడులు
ఇరాన్లోని బ్యాంకింగ్ వ్యవస్థను కూడా దెబ్బ తీసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి బ్యాంకులపై సైబర్ దాడులకు పాల్పడుతోంది. దీంతో వినియోగదారుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇరాన్లో అతిపెద్ద బ్యాంక్ సెఫా బ్యాంక్పై ఇజ్రాయెల్ హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడినట్లు అక్కడి మీడియా వెబ్సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. ఆ బ్యాంక్ కస్టమర్లు ఏటీఎంల నుంచి నగదు తీసుకునేందుకు వీలుపడటం లేదు. ఇరాన్లోని పలు గ్యాస్ స్టేషన్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సెఫా బ్యాంక్ ద్వారానే జరుగుతుంటాయి. దీనిపై సైబర్ దాడికి పాల్పడితే.. దాని ప్రభావం గ్యాస్ స్టేషన్ల నిర్వహణపైనా పడుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ అధికార ప్రతినిధి స్పందిస్తూ… బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, సజావుగా సాగుతున్నట్లు చెప్పారు.
ఖామేనీ సన్నిహితుడు అలీ షాద్మానీ మృతి
ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామేనీకి అత్యంత సన్నిహితుడు అలీ షాద్మానీ మృతిచెందినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున తెహ్రాన్ నడిబొడ్డున ఉన్న కమాండ్ సెంటర్పై తాము జరిపిన దాడుల్లో అలీ షాద్మానీ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఇరాన్ సాయుధ దళాలు.. ఈ రెండిరటికీ నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపింది. గత ఐదురోజులుగా ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల ప్రధాన అధికారి జనరల్ మొహమ్మద్ బాఘేరి, రెవెల్యూషనరీ గార్డ్స్ జనరల్ హుస్సేన్ సలామీ, ఖండాంతర క్షిపణి కార్యక్రమ అధికారి జనరల్ అమీర్ అలీ హాజీజాదే, అనేకమంది అణు శాస్త్రవేత్తలు, ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ డిప్యూటీ హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జనరల్ ఘోలంరేజా మెహ్రాబీ, డిప్యూటీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జనరల్ మెహదీ రబ్బానీ మరణించిన విషయం తెలిసిందే.
బంకర్లోకి ఖామేనీ కుటుంబం
ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో అలీ ఖమేనీ, ఆయన కుటుంబం తెహ్రాన్ ఈశాన్య ప్రాంతంలోని ఒక బంకర్లో తల దాచుకున్నట్లు తెలిసింది. యురేనియాన్ని శుద్ధి చేసుకొనే కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసేందుకు ఖామేనీకి ఇజ్రాయెల్ చివరి అవకాశమిచ్చిందని.., అందువల్లే దాడులు జరిగిన మొదటి రోజైన శుక్రవారం రాత్రి ఆయనను హత్య చేయకుండా వదిలేసిందని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ పేర్కొంది.
ఖామేనీ అంతంతోనే యుద్ధానికి ముగింపు: నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ఇరాన్ సుప్రీంలీడర్ ఖామేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెహ్రాన్పై చేస్తున్న దాడులను ఆయన సమర్థించుకున్నారు. ఇరుదేశాల మధ్య సంఘర్షణను పెంచేకంటే త్వరగా యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఖామేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని, అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడ్డుకున్నారని కథనాలు వచ్చాయి. అలా చేయడం వల్ల ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య పరిస్థితి దారుణంగా తయారవుతుందని అందుకే ట్రంప్ ‘వీటో’ చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై నెతన్యాహు స్పందిస్తూ.. అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని, యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. ‘చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఇరాన్ అస్థిరపరిచే శక్తిగా మారింది. అర శతాబ్దంగా ఇరాన్ పాలనతో ప్రతిఒక్కరూ భయపడేవిధంగా సంఘర్షణ వ్యాపించింది. సౌదీ అరేబియాలోని ఆరామ్కో చమురు క్షేత్రాలపైనా దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాప్తి, విధ్వంసం, వ్యవస్థలను బలహీనం చేయడం పెరిగి పోయింది’ అని నెతన్యాహు ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ దౌత్య చర్యలను నెతన్యాహు తొసిపుచ్చారు. అవి తప్పుదారి పట్టేంచేవన్నారు. వారు అబద్ధాలు, మోసంతో నకిలీ చర్చలను కొనసాగించి అమెరికాను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు.
సద్దాం హుస్సేన్కు పట్టిన గతి గుర్తులేదా?
తమ దేశ పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తూ ఇరాన్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని…ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ హెచ్చరించారు. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో తెహ్రాన్ పాలకులు గుర్తించుకోవా లన్నారు. ‘‘మా పౌరులపై క్షిపణి దాడులు చేస్తూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇరాన్ పాలకులను హెచ్చరిస్తున్నా. ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఇదే మార్గాన్ని ఎంచుకున్న ఇరాక్ నియంతకు (సద్దాం హుస్సేన్) ఏం జరిగిందో గుర్తుంచుకోవాలి’’ అని కట్జ్ హెచ్చరించారు. ఇరాన్ అధికారిక వార్తా సంస్థ కార్యాలయంపై దాడులను ప్రస్తావించిన ఆయన.. ఇతర సైనిక స్థావరాలపైనా దాడులు కొనసాగిస్తామన్నారు. ఐడీఎఫ్ అధికారులు సూచించిన విధంగా తెహ్రాన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.
ఫార్దో అణు కేంద్రమే ప్రధాన లక్ష్యం
ఇరాన్లోని ఫార్దో అణు కేంద్రం యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ 60 శాతానికి పైగా శుద్ధి చేయగల సామర్థ్యం ఉండటం, గతంలో 83.7 శాతం శుద్ధి చేసిన యురేనియం ఆనవాళ్లు లభించడం వంటి అంశాలు అమెరికా, ఇజ్రాయెల్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కేంద్రాన్ని నిర్వీర్యం చేస్తే ఇరాన్ అణుబాంబు తయారీ యత్నాలకు గట్టి దెబ్బ తగులుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీబీయూ-57 వంటి శక్తిమంతమైన బాంబుల ప్రయోగంపై చర్చ జరుగుతోంది. కాగా అమెరికా ఇప్పటికే తన సైనిక బలగాలను, యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని స్థావరాలకు తరలించినట్లు సమాచారం. యూఎస్ఎస్ నిమిట్జ్ విమాన వాహక నౌక కూడా ఈ ప్రాంతం వైపు కదులుతోంది. బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మోహరించింది. ఈ పరిణామాలన్నీ పశ్చిమాసియాలో మరో తీవ్ర సైనిక ఘర్షణకు దారితీస్తాయేమోనన్న భయాలను అంతర్జాతీయ సమాజంలో రేకెత్తిస్తున్నాయి.