Thursday, June 5, 2025
Homeఅంతర్జాతీయంటర్కీలో భారీ భూకంపం

టర్కీలో భారీ భూకంపం

గ్రీస్‌, ఈజిప్టు, సిరియాలోనూ ప్రకంపనలు

ఇస్తాంబుల్‌: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.2గా నమోదైంది. పశ్చిమ టర్కీ ప్రభావితమైంది. ఒకరు చనిపోగా, 70 మంది గాయపడ్డారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో భూ కంపం వచ్చినట్లు అధికారులు వెల్లడిరచారు. ఈ భూకంపం కారణంగా గ్రీస్‌, ఈజిప్టు, సిరియాతో పాటు మరికొన్ని దేశాలల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు యూరోపియన్‌ మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ తెలిపింది. భూమికి 68 కిమీల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడిరచింది. అయితే సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి… బయటకు పరుగులు తీశారు. భవనాలు పేకమేడల్లా ఊగడంతో భయాందోళనకు గురయ్యారు. కొన్ని చోట కిటికీల అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. భూకంపం నేపథ్యంలో రిసార్టు పట్టణం ఫతీహాలో 14 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యార్లికాయా వెల్లడిరచారు. నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలను పంపినట్లు మర్మారిస్‌ మేయర్‌ తెలిపారు.
పాక్‌లోనూ అలజడి…
తప్పించుకున్న 216 మంది ఖైదీలు

పాకిస్థాన్‌, కరాచీలో భూ ప్రకంపనలు సంభవించాయి. మూడు సార్లు భూమి కంపించింది. దీంతో బచా జైలులోని గోడ కూలిపోయింది. మరికొన్ని గోడలు బీటలు వారాయి. ఈ పరిస్థితుల్లో దాదాపు వెయ్యి మంది ఖైదీలను వేరే చోటకు అధికారులు తరలించే క్రమంలో 216 మంది తప్పించుకున్నారు. ఇంకొందరు అధికారుల ఆయుధాలు లాక్కుని వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించగా, నలుగురు అధికారులు గాయపడ్డారు. పారిపోయిన ఖైదీలను పట్టుకునేందుకు అధికారులు గాలింపులు చేపట్టారు. అన్ని మార్గాలు మూసివేశారు. స్థానికుల సహకారాన్ని తీసుకున్నారు. దీంతో తప్పించుకున్న వారిలో 80 మంది తిరిగి పట్టుబడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు