ముంబై: భారతదేశంలోని ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన, త్యానీ జ్యువెలరీ బై కరణ్ జోహార్ తమ సరికొత్త ప్రచారమైన ‘ఫోర్సెస్ ఆఫ్ త్యానీ’ని విడుదల చేసింది. ఈ సిరీస్లో భాగంగా ప్రఖ్యాత బాలీవుడ్ నటి షెఫాలీ షాను తమ మొదటి బ్రాండ్ అంబాసిడర్గా పరిచయం చేసింది. ఇది 10 మందికి పైగా విలక్షణమైన ప్రచారకర్తలతో చేయనున్న కంపెనీ ప్రయాణంలో ఒక సాహసోపేతమైన, కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. త్యానీ జ్యువెలరీ బై కరణ్ జోహార్, తమ సొంత మార్గదర్శకాల తో విజయాన్ని పునర్నిర్వచించిన ప్రముఖ నటులను ఒకచోట చేర్చడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రచారం రాబోయే కొన్ని నెలల పాటు బహుళ వేదికలపై అందుబాటులో ఉండనుంది. ‘ఫోర్సెస్ ఆఫ్ త్యానీ’ మొదటి ప్రచార చిత్రంలో షెఫాలీ షా కనిపించారు.