వార్సవ: పోలాండ్ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కరోల్ నవ్రాకీ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష లా అండ్ జస్టిస్ (పీఐఎస్) పార్టీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసిన కరోల్ 50.8శాతం ఓట్లతో విజయం సాధించినట్లు పోలిష్ నేషనల్ ఎలక్టోరల్ కమిషన్ (పీకేడబ్ల్యూ) సోమవారం ప్రకటించింది. ప్రత్యర్థి, అధికార సివిక్ కోయిలేషన్ (కేఓ) అభ్యర్థి, వార్సవ మేయర్ రఫల్ జాస్కోవిస్కీకి 49.11 శాతం ఓట్లు వచ్చినట్లు తెలిపింది. కరోల్ నవ్రాకీ మొదటిసారి అధ్యక్ష బరిలో నిలిచారు. ఆయన వృత్తిపరంగా చరిత్రకారులు. పోలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ రిమెంబరెన్స్ అధిపతి. కాగా, ప్రస్తుత అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడా చివరి పదవీ కాలం ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. అనంతరం కరోల్ ఆ పదవీ బాధ్యతలు చేపడతారు.
పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ నవ్రాకీ
RELATED ARTICLES