Saturday, June 21, 2025
Homeఫీజు రీయింబర్స్‌మెంట్‌…సర్కార్‌ సతమతం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌…సర్కార్‌ సతమతం

. గత వైసీపీ విధానంతో చిక్కులు
. బాధితులుగా విద్యా సంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు
. సమస్య పరిష్కారానికి అధికారుల కసరత్తు
. సచివాలయ ఉద్యోగుల ద్వారా వివరాల సేకరణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉన్నత విద్య ఫీజుల విడు దలలో ఏపీ సర్కార్‌ కొత్త సమస్య తో సతమతమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణం గా విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇందులో బాధితు లుగా మారారు. ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ప్రభుత్వం విద్యాసంస్థల ఖాతాలోనే జమ చేస్తూ వచ్చింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆ విధానాన్ని మార్పు చేశారు. కాలేజీలకు బదులుగా తల్లిదం డ్రుల ఖాతాలోకి ఫీజులు జమ చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డబ్బులు విద్యా ర్థుల తల్లుల ఖాతాలకు జమ అయినా వారు అంతిమంగా విద్యాసంస్థలకు చెల్లించాల్సిందే. అయితే 2023 – 24 విద్యా సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం మూడు క్వార్టర్ల ఫీజులు దాదాపు రూ.1,800 కోట్ల మేర బకాయి పెట్టింది. దీంతో చాలా యాజ మాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ నిలిపేశాయి. ఫీజులు కట్టాల్సిందేనని విద్యార్థులను డిమాండ్‌ చేశాయి. దీంతో చాలామంది విద్యార్థులు సొంత సొమ్ముతో ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకున్నారు. అయితే కాలేజీలకే ఫీజులు చెల్లిస్తామని, సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని కూటమి ప్రభుత్వం కాలేజీలకు హామీ ఇచ్చింది. అప్పటికే ఎక్కువ కాలేజీలు ఫీజులను వసూలు చేసుకున్నాయి. స్థోమత లేని వారు మాత్రం కళాశాలల ఫీజులు చెల్లించలేదు. అయితే ఇప్పుడు ఫీజులను కళాశాలల ఖాతాల్లో వేయాలా… విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేయాలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కాగా, ఇంకా విద్యార్థులు ఫీజులు కట్టాల్సి ఉందని, అందువల్ల తమకే ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే మొత్తం కాలేజీల ఖాతాల్లో వేస్తే..ఇప్పటికే ఫీజులు చెల్లించిన వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ క్రమంలో అసలు ఎంత మంది విద్యార్థులు కళాశాలలకు ఫీజులు చెల్లించారు అనే వివరాలను ప్రభుత్వం విద్యార్థుల నుంచి సేకరించే పనిలో నిమగ్నమైంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా 2023-24లో ఉన్నత విద్య చదివిన విద్యార్థుల వివరాలను ఇప్పటికే ప్రభుత్వం పంపింది. దీంతో సచివాలయాల ఉద్యోగులు… విద్యార్థులను సంప్రదించి ఫీజులు చెల్లించారా… చెల్లిస్తే ఎంత మేర కట్టారు అనే వివరాలు సేకరిస్తున్నారు. ఫీజులు చెల్లించినప్పుడు కాలేజీలు ఇచ్చిన రశీదులను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం కాలేజీల నుంచి కూడా వివరాలు తీసుకోవాలని భావిస్తోంది. ఒక్కో కాలేజీకి ఎంత మంది ఫీజులు చెల్లించాల్సి ఉంది. అందులో విద్యార్థులు ఎంత చెల్లించారు అనేది ధృవీకరణ చేసుకోనుంది. ఒక వేళ విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు అందించిన వివరాల్లో వ్యత్యాసం ఉంటే అప్పుడు ఏం చేయాలి… కొంత ఫీజు చెల్లించి, కొంత పెండిరగ్‌లో పెడితే అప్పుడు ఈ చెల్లింపులు ఎలా చేయాలి అనేది ప్రభుత్వానికి పెద్ద పజిల్‌గా తయారైంది. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానంలో మార్పు చేసి, తల్లుల అకౌంట్‌కు జమ చేసే విధానం ప్రవేశపెట్టడం వల్లనే ఇప్పుడు ఇటు విద్యార్థులు, అటు కళాశాలల యాజమాన్యాలకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. వైసీపీ కొత్త విధానం తీసుకువచ్చినప్పటికీ నాడు ఒక్కసారి కూడా ఫీజులను సకాలంలో తల్లుల ఖాతాలకు విడుదల చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో క్వార్టర్‌ ముగిసిన వెంటనే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేసి ఫీజులు కట్టించుకునేవి. ప్రభుత్వం ఫీజులు విడుదల చేసినప్పుడు తీసుకుందామని వేచి చూసిన అతి కొద్ది కాలేజీల యాజమాన్యాలు ప్రస్తుతం ఈ కొత్త సమస్యతో ఆందోళన చెందుతున్నాయి. 2023-24 విద్యాసంవత్సరం విద్యార్థులు ఇప్పటికే కళాశాలల నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ఫీజులను తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తే అవి వసూలు చేసుకోవడం తమ వల్ల కాదని ఆయా యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. నాడు విద్యార్థులపై ఒత్తిడి చేయని తమకు న్యాయం చేయాలని సదరు విద్యాసంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు