ఈసీ తీరుతో మ్యాచ్ఫిక్సింగ్ స్పష్టం: రాహుల్
న్యూదిల్లీ : మహారాష్ట్రలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పోలింగ్కు సంబంధించి 45 రోజుల సీసీటీవీ ఫుటేజీ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశాయి. ఇదే క్రమంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం ఈసీకి ప్రశ్నలు సంధించారు. ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అని నిలదీశారు. పోలింగ్ బూత్ల ఫుటేజి బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన సంస్థ… ఆధారాల్లేకుండా చేస్తోందని ఆరోపించారు. ‘ఒకరు జాబితా మెషిన్ రీడిరగ్ ఫార్మట్లో ఉండదు. సీసీటీవీ ఫుటేజిని చట్టసవరణ ద్వారా దాచేశారు. ఎన్నికల ఫొటో వీడియో ఏడాదిగా లేదు. 45 రోజుల్లోనే తొలగిస్తారు. జవాబుదారీ కలిగివున్న సంస్థనే ఆధారాలు నాశనం చేస్తున్నది. ఎన్నికల్లో మ్యాచ్ఫిక్సింగ్ జరిగిందని స్పష్టమైంది. ఇలాంటి ఎన్నిక ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’ అని హిందీలో రాహుల్ ట్వీట్ చేశారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏకీకృత, డిజిటల్ ఓటరు జాబితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చట్టవిరుద్ధం… ఓటర్ల గోప్యతకు భంగం: ఈసీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ కోసం ప్రతిపక్షాల డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఫుటేజి బయట పెట్టలేమని తేల్చిచెప్పింది. అలా చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఈసీ వెల్లడిరచింది. ఒక సమూహం లేదా ఓటర్ను సులభంగా గుర్తించేందుకు వీలుగా సీసీటీవీ ఫుటేజీ ఉపయోగపడుతుందని తెలిపింది. ఓటర్లను బెదిరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుటేజీని బహిర్గతం చేయలేమని పేర్కొంది. అలా చేస్తే చట్టపరంగా సమస్యలు వస్తాయని ఎన్నికల సంఘం తెలిపింది. అంతర్గత పర్యవేక్షణకు వీడియోలు ఉపయోగపడతాయని చెప్పింది. సంబంధిత వ్యవహారాన్ని విచారించే న్యాయస్థానాలు కోరితే వివరాలు అందజేస్తామని ఈసీ తెలిపింది. 45 రోజుల్లోగా ఫిర్యాదులు, కోర్టు కేసులు లేకపోతే ఓటింగ్ ఫుటేజీలు తొలగించాలని సంబంధిత అధికారులకు ఎన్నికల సంఘం సూచించింది. బూత్ల సీసీటీవీ, వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ డేటా మొత్తం 45 రోజుల తర్వాత తొలగించవచ్చని అధికారులకు స్పష్టంచేసింది.