న్యూదిల్లీ: భారతదేశంలోని ప్రముఖ ఎస్యూవీ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ తమ నూతన వాహనం మహీంద్రా థార్ రాక్స్ ఏఎక్స్7ఎల్ వేరియంట్తో డాల్బీ అట్మోస్ అందుబాటులోకి వచ్చింది. లీనమయ్యే మనోరంజన అనుభవాన్ని అందించడంలో అగ్రగామిగా ఉన్న డాల్బీ లాబొరేటరీస్ సహకారంతో, ప్రపంచ ఎస్యూవీ మార్కెట్లో మొదటి ఆవిష్కరణగా, డాల్బీ అట్మోస్ ద్వారా 4-ఛానల్ ఇమ్మర్సివ్ ఆడియోను వాహనంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయాణంలో సంగీతాన్ని ఆలకించే అనుభవాన్ని థార్ రాక్స్
ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో గానా స్ట్రీమింగ్ నేరుగా విలీనం కావడంతో, థార్ రాక్స్ వాహనదారులు ఎప్పుడైనా డాల్బీ అట్మోస్లో సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఇది ప్రతి ప్రయాణాన్ని మరపురానిదిగా చేస్తుందని డాల్బీ లాబొరేటరీస్ కమర్షియల్ పార్టనర్షిప్స్ – ఐఎంఈఏ సీనియర్ డైరెక్టర్ కరణ్ గ్రోవర్ తెలిపారు.