దుబాయ్: యెమన్లోని ఓడరేవు నగరం హోడైడాపై ఇజ్రాయిల్ మంగళ వారం దాడి చేసింది. ఇజ్రాయిల్ సైన్యం, నేవీ సంయుక్తంగా ఈ దాడులు చేశాయి. హౌతీలపై ఇజ్రాయిల్ దాడి చేయడం ఇదే మొదటిసారని, తమపై దాడులకు ఓడరేవులు వినియోగిస్తున్నారని ఇజ్రాయిల్ పేర్కొంది. రాస్ ఇసా, హోడైడా, అల్-సలీఫ్ ఓడరేవులను ఖాళీ చేయాలని ఆన్లైన్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఓడరేవుల్లో ఆయుధాలను రవాణా చేసేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు హౌతీలు వినియోగిస్తున్నట్లు ఆరోపించింది. పౌర మౌలిక సదుపాయాలను దుర్వినియోగిస్తున్నారని పేర్కొంది.