సూర్యనమస్కారాలతో గిరిజన విద్యార్థుల గిన్నీస్ రికార్డ్
విశాఖ ఉక్కును కాపాడిరది తమ ప్రభుత్వమే: చంద్రబాబు
యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందన్నారు. యోగా దినోత్సవానికి 175 దేశాలు మద్దతిచ్చాయన్నారు. ఇది సాధారణ విషయం కాదన్నారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని, గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందన్నారు.
విశాలాంధ్ర బ్యూరో -విశాఖపట్నం: అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉదయం ఆరు గంటలకు యోగా ప్రదేశానికి రావాలని ఔత్సాహికులకు పిలుపునిస్తే తెల్లవారుజామున రెండు గంటల నుంచే వేదిక వద్దకు చేరుకున్నారని అన్నారు. యోగా నిర్వహణకు ప్రకృతి సహకరించడంతో పాటు వరుణదేవుడు కరుణించాడని తెలిపారు.3,03,654 మంది క్యూఆర్ కోడ్ తో వచ్చారని వెల్లడిరచారు. ఒకే వేదిక వద్ద మూడు లక్షల మందికి పైగా యోగా చేయటం, 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు చేసిన సూర్య నమస్కారాలతో రెండు గిన్నీస్ రికార్డులు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించామని వివరించారు. యోగా కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగా డే లో పాల్గొనేందుకు 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. పదేళ్లుగా మోదీ చేసిన కృషి ఫలించిందని, 170 దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారన్నారు. శనివారం ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల ప్రాంతాల్లో 10 కోట్ల మంది ప్రజలు యోగాలో భాగస్వామ్యయ్యారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. సూరత్లో 1.47 లక్షల మందితో యోగా చేసి గిన్నీస్ రికార్డ్ సాధిస్తే నేడు మూడు లక్షలమంది పైచిలుకు మందితో యోగా డే నిర్వహించాం. రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో యోగా సాధన చేశారు. మొత్తంగా 2.17 కోట్ల మంది హాజరయ్యారని, 1.44 లక్షల మంది యోగా శిక్షకులు తయారయ్యారని తెలిపారు. కేంద్రం ప్రమోట్ చేసేందుకు ఐదు లక్షల టీ షర్టులు, ఐదు లక్షలు మ్యాట్లు రాష్ట్రానికి పంపిందన్నారు. 30 రోజుల పాటు పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినందుకు మీడియా ప్రతినిధులను అభినందిస్తున్నానన్నారు. ‘యోగాడే స్ఫూర్తిగా విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. యోగా ఒక గేమ్ ఛేంజర్ అవుతుంది. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఈ ఏడాది ఆరోగ్య శాఖకు రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ.ఐదు వేలకోట్లకు పైగా ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవకు ఖర్చు చేస్తున్నాం’ అని సీఎం అన్నారు. భారతదేశంలో 1995లో సాంకేతిక విప్లవం వచ్చిందన్నారు. దీన్ని అందిపుచ్చుకుని భారతీయులు ఎదిగారని అన్నారు. టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో ప్రధాని మోదీని మించినవారు లేరన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజలందరి సెంటిమెంట్ అని దానిని కూటమి ప్రభుత్వం కాపాడిరదని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ రైల్వే జోన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా ఉండేలా అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖకు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ సంస్థలు వస్తున్నాయి. రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. విశాఖపట్నానికి చాలా భవిష్యత్ ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలతో కలిపి ఎకనమిక్ కారిడార్గా ఏర్పాటు చేస్తాం. విశాఖ నగరం మరో ముంబైలాగా తయారు అవుతుంది. తిరుపతి కేంద్రంగా రాయలసీమను, అమరావతి కేంద్రంగా అక్కడి జిల్లాలను అభివృద్ధి చేస్తామన్నారు. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం. దీని ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. యువతకు ఇచ్చిన హామీ మేరుకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని సీఎం స్పష్టం చేశారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్కుమార్ గుప్తా, మంత్రులు పాల్గొన్నారు.