- Advertisement -
విశాలాంధ్ర అనంతపురం మంగళవారం జరిగిన రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా సమితి సమావేశం సమావేశంలో సి నాగప్ప జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో ఎన్నో పోరాటాలలో పాల్గొని అనుభవంతో రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక చేయడం జరిగిందన్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన నాగప్ప మాట్లాడుతూ… రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తామన్నారు.


