టెల్అవీవ్: గాజాలో భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ తాజాగా రఫాలోని మానవతా సంస్థకు చెందిన కేంద్రంపై కాల్పులను జరిపినది తాము కాదని ఓ ప్రకటన చేసింది. ‘గాజా హ్యూమానిటేరియన్ ఫౌండేషన్’ కేంద్రం వద్ద కాల్పుల ఘటనకు ఐడీఎఫ్కు సంబంధం లేదని పేర్కొంది. ఇది హమాస్ పని, మా దళాలు కాల్పులు జరుపలేదు అని ఒక ప్రకటన విడుదల చేసింది. తమ వాదనకు బలం చేకూర్చే విధంగా ఓ డ్రోన్ వీడియోనూ బహిర్గతం చేసింది. ఆహార కేంద్రం వద్దకు వెళుతున్న పలస్తీనియన్లపై కాల్పులు జరుపుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ప్రజలు ఆహారం తీసుకోకుండా హమాస్ అడ్డుకున్నట్లు ఎక్స్లో ఐడీఎఫ్ ఆరోపిం చింది. కాల్పుల్లో 31 మంది చనిపోయిన విషయం విదితమే. మృతులను తల, ఛాతిపై కాల్చి చంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఇజ్రాయిల్ల్ నియంత్రణలో ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే హమాస్ వర్గీయులే ఈ కాల్పులకు తెగబ డ్డారని, ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఐడీఎఫ్ చెప్పుకుం టోంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 31 మంది చనిపోగా, 150 మందికి పైగా గాయపడ్డారు. గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్(జీహెచ్ఎఫ్) కేంద్రం వద్ద ఈ దాడి జరిగిందని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. వేల సంఖ్యలో వస్తున్న జనంపై కిలోమీటరు దూరం నుంచి కాల్పులు జరిపారని స్థానికులు వెల్లడిరచారు. అన్ని వైపుల నుంచి బుల్లెట్లు దూసుకొచ్చాయని వాపోయారు.