Friday, June 13, 2025
Home‘రుద్రాస్త్ర’ ప్రయోగంవిజయవంతం

‘రుద్రాస్త్ర’ ప్రయోగంవిజయవంతం

పోఖ్రాన్‌ : భారత సాయుధ దళాల అమ్ములపొదిలోకి మరో వినూత్నమైన మానవ రహిత విమానం (యూఏవీ) చేరనుంది. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ రూపొందించిన ‘రుద్రాస్త్ర’ యూఏవీని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజిలో విజయవంతంగా పరీక్షించారు. ఇది హైబ్రీడ్‌ వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండిరగ్‌ శ్రేణిలోకి వస్తుంది. ఎక్కువసేపు గగనతలంలో ఉంటూ… లక్ష్యంపై కచ్చితత్వంతో దాడి చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. మిషన్‌ మధ్యలో దీనిలో మార్పులు చేసుకొనే అవకాశం ఉంది. ఈ యూఏవీ 50 కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా పని చేసింది. స్థిరమైన రియల్‌టైమ్‌ వీడియో అందించడంతోపాటు సురక్షితంగా లాంచింగ్‌ పాయింట్‌కు తిరిగి వచ్చింది. లక్ష్యంపై చక్కర్లు కొట్టడం కూడా కలుపుకొంటే దీని రేంజి 170 కిలోమీటర్లు. ఇది గంటన్నరసేపు నిరంతరాయంగా ఆకాశంలో ప్రయాణించింది. ఈ పరీక్షలో లక్ష్యంపై అత్యంత కచ్చితత్వంతో యాంటీ పర్సనల్‌ వార్‌హెడ్‌ను ప్రయోగించింది. అది భూమికి అత్యంత సమీపంలోకి వచ్చాక ఆ వార్‌హెడ్‌ను పేల్చేసింది. నిర్దేశించిన ప్రమాణాలను ఇది అందుకొంది. ఈ పరీక్ష రక్షణ రంగంలో భారతీయ టెక్నాలజీల వృద్ధి, ఆత్మనిర్భర్‌ భారత్‌లో ముందడుగును తెలియజేస్తోంది. కాగా, భారత్‌ డ్రోన్‌ యుద్ధ తంత్రంలో బలోపేతం కావడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఏప్రిల్‌లో శత్రు యుద్ధ నౌకలపై సైలెంట్‌గా దాడి చేయగల వాటర్‌ డ్రోన్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. దీనిలోని పరికరాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు మెరుగ్గా పనిచేసినట్లు నాడు వెల్లడిరచింది. మరోవైపు సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ యాంటీ డ్రోన్‌ వ్యవస్థ భార్గవాస్త్రను కూడా రూపొందించింది.
దీనిని మేలో విజయవంతంగా పరీక్షించారు. ఇక డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) మానవ రహిత విమానం రుస్తుం సిరీస్‌ డ్రోన్‌లను అభివృద్ధి చేస్తోంది. మధ్యస్థ ఎత్తులో ఎక్కువ సమయం ప్రయాణించేలా దీన్ని సిద్ధం చేస్తున్నారు. అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ వంటి ప్రముఖ సంస్థలూ అధునాతన డ్రోన్ల తయారీని చేపడుతున్నాయి. వీటిని సరిహద్దులో నిఘా, యుద్ధం, సామగ్రి చేరవేత వంటివాటి కోసం రూపొందిస్తున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో ఇజ్రాయిల్‌ సాంకేతికత సహాయంతో బెంగళూరు సంస్థ తయారుచేసిన స్కైస్ట్రైకర్‌ ఆత్మాహుతి డ్రోన్లను సైన్యం వినియోగించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు