క్వాష్ పిటిషన్పై నేడు విచారణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సింగయ్య మృతి కేసులో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదంటూ తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరులో ర్యాలీ నిర్వహించగా ఏటుకూరు బైపాస్ ఆంజనేయస్వామి విగ్రహం వద్ద జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద నలిగి సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సింగయ్య మృతి కేసులో జగన్ను ఏ-2గా చేర్చారు. జగన్తో పాటు మాజీ మంత్రులు, వైసీపీ నేతలు నేతలు పేర్ని నాని (ఏ5), విడదల రజిని (ఏ6)లను నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే పేర్ని నాని, విడదల రజనిలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నీ కలిపి హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.