Friday, June 6, 2025
Homeజిల్లాలుఅనంతపురంబాధితురాలకు సవేరా ఆస్పత్రి యాజమాన్యం 15 వేలు అందజేత

బాధితురాలకు సవేరా ఆస్పత్రి యాజమాన్యం 15 వేలు అందజేత

సిపిఐ నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు

విశాలాంధ్ర -అనంతపురం : బాధితురాలకు సవేరా ఆస్పత్రి యాజమాన్యం రూ.15 వేలు అందజేసినట్లు సిపిఐ నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిజిహెచ్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ విభాగంలో సవేరా ఆస్పత్రి మేనేజర్ కిషోర్ జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ ను కలిసి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సవేరా ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ బాధితురాలు దగ్గర ఐదు వేలు వసూలు చేసినందుకు గాను మూడింతల డబ్బును పదహైదు వేల రూపాయలు బాధితురాలు బి. సుజాతకు సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాముల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర్ కార్యదర్శి ఎన్ శ్రీరాములు మాట్లాడుతూ…
జనవరి 15,2025 నా బి.సుజాత, కల్పన జోషి కాలనీకి చెందిన మహిళ, తన భర్త రోడ్డు ప్రమాదంలో గాయపడిన తరవాత తీవ్ర ఒత్తిడితో ఛాతీ నొప్పితో కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్‌కి వెళ్లగా, రాత్రి సమయంలో డాక్టర్ లేకపోవడంతో సవేరా హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. అక్కడ అత్యవసర వైద్యం అవసరమై ఉన్నప్పటికీ, ఆరోగ్యశ్రీ కింద చికిత్స నిరాకరించి ముందుగా డబ్బులు కట్టాలని యాజమాన్యం వత్తిడి చేసింది. అంగీకరించకపోతే రాత్రి 2 గంటలకు ₹5,000 వసూలు చేసి డిశ్చార్జ్ చేశారన్నారు . చివరికి మార్క్ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స జరిగిందన్నారు. ఈ విషయంపై అంచలంచెలుగా ధర్నాలు చేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ సవేరా ఆస్పత్రి పై విచారణ చేపట్టాలని కమిటీ వేసి తప్పు జరిగిందని నిర్ధారణకు రావడంతో ఆసుపత్రి పై లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ బాధితురాలకు 15 వేలు ఇవ్వడం పట్ల సిపిఐ నగర్ సమితి హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శులు బి. రమణ, అలిపిరా బాధిత కుటుంబం సభ్యులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు