Friday, June 6, 2025
Homeవ్యాపారంఖారోడా, మనేసర్‌లలో మారుతి సుజుకి సౌర సామర్థ్యం విస్తరణ

ఖారోడా, మనేసర్‌లలో మారుతి సుజుకి సౌర సామర్థ్యం విస్తరణ

న్యూదిల్లీ: తన కార్యకలాపాలలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచాలనే తన నిబద్ధతను బలోపేతం చేస్తూ, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ (ఎంఎస్‌ఐఎల్‌) తన సౌర సామర్థ్యాన్ని రెండు కొత్త ప్రాజెక్టులతో 30ఎండబ్ల్యుపీ విస్తరించినట్లు ప్రకటించింది. కంపెనీ హర్యానాలోని ఖారో?డాలోని తన కొత్త సౌకర్యంలో 20ఎండబ్ల్యుపీ సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దాని మనేసర్‌ సౌకర్యంలో మరో 10ఎండబ్ల్యుపీ సౌర సామర్థ్యాన్ని జోడిరచింది. ఈ అదనపు ప్రాజెక్టులతో, గత ఏడాది కాలంలో ఎంఎస్‌ఐఎల్‌ తన అన్ని ప్రాంతాలలో మొత్తం సౌరశక్తి సామర్థ్యం 49ఎండబ్ల్యుపీ నుండి 79ఎండబ్ల్యుపీకి పెరిగింది. అంతేకాకుండా, కంపెనీ తన వినియోగం కోసం రాష్ట్ర విద్యుత్‌ బోర్డుల నుండి సేకరించే గ్రీన్‌ పవర్‌ వాటాను పెంచుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు