Friday, June 6, 2025
Homeరెండు దశల్లో కుల గణన

రెండు దశల్లో కుల గణన

. 2026 అక్టోబరులో జమ్మూకశ్మీర్‌, లదాఖ్‌లో జనాభా లెక్కలు
. మిగతా చోట్ల 2027 మార్చి 1 నుంచి ప్రారంభం
. ఆ తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన

న్యూదిల్లీ : దేశవ్యాప్తంగా జనకుల గణన రెండు దశల్లో జరగనుంది. 2027 మార్చి 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అంతకుముందు అంటే 2026 అక్టోబరులో జమ్మూకశ్మీర్‌, లదాఖ్‌లో జనాభా లెక్కల ప్రక్రియ మొదలవుతుంది. ఇది పూర్తైన తర్వాతే దేశంలోని మిగతా చోట్ల ప్రక్రియ చేపడతారు. జనగణనలో భాగంగానే కుల గణన జరగనుంది. ఈ ప్రక్రియ అనంతరమే నియోజకవర్గాల పునర్విభజనను చేపడతారు. ఈ బృహత్‌ కార్యానికి సంబంధించి అధికారిక ప్రకటన బుధవారం వెలువడిరది. 2026, అక్టోబరు 1వ తేదీ నుంచి జమ్మూకశ్మీర్‌, లదాఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో జనాభా లెక్కలను నిర్వహిస్తారని పేర్కొంది. అయితే జనగణనలో భాగంగా కులగణన నిర్వహించే ఉద్దేశంతో ‘నోటిఫికేషన్‌ ఫర్‌ ఇంటెంట్‌’ను ఈనెల 16న ప్రభుత్వ గెజెట్‌లో ప్రచురిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది. ప్రతి పదేళ్లకు జనగణన నిర్వహించి జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌)ను అప్‌డేట్‌ చేస్తారు. సెన్సెస్‌ యాక్ట్‌1948, సెన్సెస్‌ రూల్స్‌`1990 కింద ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే 2011 తర్వాత జనగణన జరగలేదు. షెడ్యూల్‌ ప్రకారం 2021లో జనగణన జరగాలి కానీ అది కోవిడ్‌ కారణంగా వాయిదా పడిరది. అయితే కుల గణన కోసం రాజకీయ పార్టీల నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇందుకోసం చాలా ఏళ్లుగా డిమాండ్‌ ఉంది. జనగణనతో పాటు కుల గణన నిర్వహించాలన్న డిమాండ్‌కు కేంద్రం అంగీకరించింది. ఈ ప్రక్రియకు రాజకీయ వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ ఆమోదించి నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఏప్రిల్‌లో ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా జన గణనతో పాటు కుల గణన కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు