Friday, June 6, 2025
Homeబనకచర్లకు కేంద్ర సాయం

బనకచర్లకు కేంద్ర సాయం

. పీ`4 కోసం ప్రతి జిల్లాలో కార్యాలయం
. పాలనలో మంత్రులు మరింత వేగం
. నేరస్తులతో రాజకీయాలు చేయాల్సి రావడం దారుణం
. నన్ను జైల్లో వేశారని… జగన్‌ను వేయాలంటే ఎలా?
. మంత్రివర్గం భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
. 17 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష
. ఏపీఎస్‌పీఎఫ్‌లో 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి
. 13 అంశాలపై కేబినెట్‌ తీర్మానాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రానికి శాశ్వత కరువు నివారణకు దోహదపడే పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. దీనికి నిధుల సమస్య కూడా ఏమీ ఉండదని, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(ఏడీబీ), హైబ్రిడ్‌ అన్యూటీ మోడల్లో కూడా నిధులు వస్తాయని అన్నారు. ఆలస్యమైన కొద్దీ ప్రతి ఏడాది నిర్మాణ వ్యయం పెరుగుతుందని, అందువల్ల సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టును పట్టాలెక్కించాలని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి తెనాలిలో రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శిండం, మద్యం కుంభకోణం అంశాలు చర్చకొచ్చాయి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ‘జగన్‌ తప్పు చేశాడని స్పష్టమవుతోంది కదా? మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు’ అని సీఎంను అడిగారు. దానిపై చంద్రబాబు మాట్లాడుతూ ‘నన్ను జైల్లో వేశాడని…జగన్‌ను కూడా జైలులో వేయమంటారా’ అని తిరిగి ప్రశ్న వేశారు. ‘అతను తప్పులు చేసినట్లు రుజువులు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కక్షపూరితంగా ఆయన చేసిన పని మనం చేసి చూపించాలంటే ఎలా కుదురుతుంది. అది సరికాదు కదా’ అని చంద్రబాబు అన్నారు. విజయ్‌మాల్య లాంటి వాళ్లు డబ్బులు తిని విదేశాలకు వెళ్లిపోగా… రాజకీయ ముసుగులో ఉండి జగన్‌ నేరాలు చేస్తున్నారని విమర్శించారు. పైగా నేరస్థులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌, మిథున్‌ రెడ్డి ఇద్దరిలో ఎవరు ముందు జైలుకు వెళ్తారనే అంశంపై వైసీపీలో చర్చ జరుగుతోందన్నారు. తప్పులు చేసిన వారు తప్పించుకోకూడదని, అయితే చట్టం, న్యాయం ప్రకారమే ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. నేరస్థుడు ఒక నేరం చేసి బయటకు వెళ్లిన తరువాత అతను ఏం చేస్తున్నాడనేది తెలుసుకునే వ్యవస్థ వెంటనే అమలు చేయాలని చెప్పారు. మంత్రులు ప్రతి అంశంలో ఆచితూచి అడుగులు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో నేరస్థులు ప్రభుత్వానికి భయపడి వెళ్లిపోయేవారని, ఇప్పుడు మనం నేరస్థులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేరం చేసి మళ్లీ ప్రభుత్వంపైనే నిందలు వేసే పరిస్థితి నెలకొందన్నారు. ఈ ఏడాది మంత్రులు బాగా పనిచేశారని, ఇంకా కష్టపడాలని, ఇప్పటివరకు ఏం చేశారనేది ఎవరికివారే సమీక్ష చేసుకోవాలని సూచించారు. రాబోయే ఏడాదికి ప్రణాళిక వేసుకో వాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలు బాగా చేశామని, కానీ ఏం చేసినా జనానికి సాధికారత కల్పించాలని మంత్రులకు తెలిపారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు సంబంధించి 2026 జనవరికి కార్యరూపం తీసుకురావాలని మంత్రులను ఆదేశిం చారు. క్వాంటం వ్యాలీ భవనం డిజైన్లను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు చూపించాలని అధికారు లకు సీఎం సూచించారు. ఈ నెల 15న తిరుపతిలో సినిమా ప్రముఖులతో యోగా నిర్వహించాలని తెలిపారు. పర్యాటకశాఖ మంత్రి వెళ్లి సెలబ్రెటీలను ఆహ్వానించాలని, తాను కూడా కొంత మందికి ఫోన్లు చేసి చెబుతానని సీఎం తెలిపారు. కడప మహానాడుకు వాతావరణం బాగా సహకరించిందని, ఏర్పాట్లు కూడా బాగా చేశారని కార్యక్రమానికి ఇంచార్జిగా వ్యవహరించిన నేతలను అభినందిం చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సీఎంకు మంత్రులు అభినందలు తెలిపారు. పీ4కు సంబంధించి ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అధికారంలోకి రావడానికి, అధికారాన్ని అనుభవించడానికి యువగళం పాత్ర కూడా ఉందని లోకేశ్‌ను సీఎం అభినందించారు. ప్రజలు ఆశయాలకు, అంచనాలకు అనుగుణంగా పని చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. మంత్రివర్గ సమావేశంలో మొత్తం 13 అంశాలపై చర్చ జరిగింది. ఈ నిర్ణయాలను సమాచార, గృహ నిర్మాణశాఖమంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. స్త్ర ఎన్టీఆర్‌ సుజల పథకం కింద శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం, ఆదివాసీ ప్రాంతాలకు ఆర్‌ఓ ప్లాంట్‌ ద్వారా సురక్షిత తాగునీటి సరఫరా కోసం రూ.575.75 లక్షల వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్లకు, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 533 నీటి కొరత ఉన్న జనావాసాల్లో కవరేజీ కోసం క్లస్టర్‌ ఆధారిత విధానంలో 15 వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు రూ.822.86 లక్షల వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్త్ర సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరుకు ఆమోదం. స్త్ర ఏపీఎస్‌పీఎఫ్‌లో 248 మంది కానిస్టేబుళ్లను హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇవ్వడానికి గ్రీన్‌సిగ్నల్‌. స్త్ర వైఎస్సార్‌ జిల్లా పేరును వైఎస్సార్‌ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్‌కు ఆమోదం. స్త్ర ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ స్థాపన కోసం ఆగిరిపల్లి మండలం నూగొండపల్లి గ్రామంలో మొత్తం 94.497 సెంట్ల ప్రభుత్వ భూమి కేటాయింపు. స్త్ర ఏలూరు జిల్లాలో నిర్మించతలపెట్టిన హైదరాబాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు మాజీ ఐఏఎస్‌ అధికారి కసరనేని దమయంతి దాన ప్రక్రియ ద్వారా ఇవ్వతలపెట్టిన పెదవేగి మండలం వంగూరు గ్రామంలోని 10.88 ఎకరాల భూమి బదలాయింపునకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు మినహాయింపు. స్త్ర కార్మిక రంగ సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధివిధానాల కూర్పు భారాన్ని తగ్గించేం దుకు, పరిశ్రమల చట్టంలో సవరణలకు ఆమోదం. స్త్ర విశాఖపట్నంలోని హరిత హోటల్‌ యాత్రీనివాస్‌ ఆధునీకరణకు చేపట్టిన పనులకు మంత్రి మండలి ఆమోదం. స్త్ర ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్వాంటం మిషన్‌ (ఎస్‌క్యూఎం) స్థాపనకు ఐటీ, ఎలెక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం స్త్ర అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సీఆర్‌డీఏ ద్వారా 50 ఎకరాల భూమి కేటాయింపు, సైబర్‌ సెక్యూరిటీ, డ్రగ్‌ డిస్కవరీ, మెటీరియల్‌ సైన్స్‌, హై-పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ రంగాలలో అత్యాధునిక పరిశోధనలకు దోహదపడే ఈ మిషన్‌ ద్వారా రాష్ట్రం క్వాంటం టెక్నాలజీకి జాతీయ కేంద్రంగా మారనుంది. జూన్‌ 2025లో క్వాంటం సమ్మిట్‌ నిర్వహించి అంతర్జాతీయ నిపుణులతో వ్యూహాత్మక కార్యాచరణను రూపొందించనుంది. స్త్ర ఒక కుటుంబంఒక పారిశ్రామికవవేత్త అనే నిర్ణయాత్మక విధానంతో 175 నియోజకవర్గాల్లో మొత్తం 175 ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్దికి నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు