Saturday, June 7, 2025
Homeజాతీయంఆర్సీబీ విజయోత్సవంలో విషాదం: ఘటనపై హైకోర్టు సుమోటో విచారణ

ఆర్సీబీ విజయోత్సవంలో విషాదం: ఘటనపై హైకోర్టు సుమోటో విచారణ

బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు స్పందించింది. ఈ దుర్ఘటనను న్యాయస్థానం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కేసుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ జరపనున్నట్లు ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిన్న ఆర్సీబీ జట్టు విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు