ఢాకా: బంగ్లాదేశ్ జాతీయ గీత రచయిత, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇంటిపై దాడి జరిగింది. బంగ్లాదేశ్, సిరాజ్గంజ్ జిల్లాలోని చారిత్రక ‘కచ్చారిబరి’లో ఓ మూక విధ్వంసం సృష్టించింది. మ్యూజియం ఉద్యోగికి, సందర్శనకు వచ్చిన వ్యక్తి మధ్య గొడవ ఈ మేరకు దారితీసింది. కుటుంబ సమేతంగా రవీంద్ర మోమోరియల్ మ్యూజియానికి వచ్చిన వ్యక్తి తన బైకుకు పార్కింగ్ ఫీజు విషయంలో అక్కడి సిబ్బందితో గొడవ పడ్డారు. దీంతో ఆయనను అక్కడి ఆఫీసు గదిలో సిబ్బంది నిర్బంధించారు. భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇది ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహానికి లోనయ్యారు. ఇదే క్రమంలో మ్యూజియంపై దాడి చేసి కచ్చారిబరి ఆడిటోరియాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కు గాయాలయ్యాయి. పురావస్తు శాఖ వెంటనే స్పందించి త్రిసభ్య విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఐదు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. ఇదే క్రమంలో కచ్చారిబరిని తాత్కాలికంగా మూసివేసినట్లు అక్కడి నిర్వాహకులు మహమ్మద్ హబీబుర్ రెహ్మాన్ తెలిపారు. అవాంఛనీయ ఘటనలను నివారించడం కోసమే ఈ మేరకు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ పర్యాటక ప్రాంతాన్ని అధికారికంగా నిఘా నీడలో ఉంచినట్లు వెల్లడిరచారు.