Wednesday, June 18, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపార్టీ కమిటీల ఎంపికతో తెదేపాని మరెంత బలోపేతం చేద్దాం

పార్టీ కమిటీల ఎంపికతో తెదేపాని మరెంత బలోపేతం చేద్దాం

కమిటీల ఎంపికలో ప్రతి కార్యకర్త,కుటుంబ సాధికారిక సారథ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం
విశాలాంధ్ర ధర్మవరం; కార్యకర్తల అభీష్టం మేరకే తెలుగుదేశంపార్టీ గ్రామ,మండల స్థాయి ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తలుపుల మండల పార్టీ ఎన్నికల పరిశీలకులు శ్రీశైలంపురుషోత్తం గౌడ్ అన్నారు.ఈసందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆయన తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో తెదేపా ఎన్నికల ప్రక్రియపై మండల,గ్రామ స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు ముబారక్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా పార్టీ ఎన్నికల పరిశీలకులు పురుషోత్తంగౌడ్ మాట్లాడుతూ,గతం కంటే భిన్నంగా పార్టీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని కార్యకర్తల అభిప్రాయంతో పాటు కుటుంబసాధికారిక సారధుల అభిప్రాయాలను పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని,ఒక్క పదవికి ఎంతమందైనా నామినేషన్ వేయవచ్చునని తెలిపారు. తుది నిర్ణయం రాష్ట్ర పార్టీ దేనని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామ మండల ఎన్నికల ప్రక్రియ కోసం రాష్ట్ర పార్టీ ఐవీఆర్ఎస్ ద్వారా మండలంలో గల తెలుగుదేశంపార్టీ కార్యకర్తల అభిప్రాయాలను, కుటుంబ సాధికారిక సారధుల అభిప్రాయాలను తెలుసుకుంటారని, వీటిని అన్నింటినీ క్రోడీకరించుకొని పార్టీ కమిటీల ఎన్నిక జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశించిన షెడ్యూల్ ప్రకారము గ్రామ,మండల స్థాయి కమిటీల ఎన్నిక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని విభాగాల పదవులకు వచ్చినటువంటి నామినేషన్ల అన్నింటిని గౌరవ శాసనసభ్యులు కందికుంటవెంకట ప్రసాద్ గారి ద్వారా జిల్లా కమిటీకి నివేదించడం జరుగుతుందని అక్కడి నుండి రాష్ట్ర పార్టీకి పంపడం జరుగుతుందని ఆయన అన్నారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపునిచ్చి తెదేపాలో వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. పార్టీలోపదవులు పొందని వారు నిరాశకు గురి కాకుండా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు