ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
నామాల నాగార్జున
విశాలాంధ్ర ధర్మవరం; నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినవేల విద్యార్థులను తల్లిదండ్రులను ఫీజుల పేరుతో ముక్కు పిండి కాసులు వసూలు చేస్తున్న ధర్మవరం ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం నందు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖతిజున్ కుఫ్రాకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున మాట్లాడుతూ… ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల వారు ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా నోటీస్ బోర్డులలో ఫీజుల పట్టికను, ఉపాధ్యాయుల అర్హత వివరాలు, అదేవిధంగా విద్యార్థులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపుతూ డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ డొనేషన్ల రూపంలో అడ్మిషన్ ఫీజు పేర్లతో సెమీ రెసిడెన్షియల్ పేరుతో అనేక రకాలుగా తల్లిదండ్రులను వేలాది రూపాయలు ఫీజులు రూపంలో దండుకుంటున్నారని మండిపడ్డారు. కావున మండల వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలలపై తక్షణం శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఏవో కు తెలియజెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి శ్రీనాథ్, పట్టణ ఉపాధ్యక్షులు అమన్, బాలాజీ ,చిన్ను పాల్గొన్నారు.
ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీ అరికట్టాలి..
RELATED ARTICLES