సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్
విశాలాంధ్ర అనంతపురం : పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న మారణకాండ ఆపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పేర్కొన్నారు. సీపీఐ నగర్ సమితి ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా గురువారం స్థానిక అనంతపురం క్లాక్ టవర్ వద్ద సీపీఐ నగర్ సమితి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ మాట్లాడుతూ… పాలస్తీనాపై ఇజ్రాయిల్ దారుణ మారణకాండ సాగిస్తుందన్నారు. ఇప్పటివరకు సుమారు వేలది మంది మరణించారని, వారిలో పిల్లలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికన్ సామ్రాజ్యవాదం తన ఆయుధ వ్యాపార ప్రయోజనాల కోసం యుద్ధాన్ని రగిలిస్తోందన్నారు. చాలా కాలంగా భారత ప్రభుత్వం పాలస్తీనాకు అండగా నిలబడిందన్నారు. మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఇజ్రాయిల్లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నిలవడమే కాకుండా అమెరికాకు భాగస్వామిగా మన దేశాన్ని మార్చేస్తున్నారని విమర్శించారు. ట్రంప్ సామ్రాజ్య వాదానికి మద్దత్తునిస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని ప్రపంచ శాంతి కోసం భారతదేశ నిలబడాలని డిమాండ్ చేశారు. తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేయడం, ఇరాన్ ప్రతిదాడి చేయడం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రగిలిస్తోందన్నారు. యుద్ధం ఏ రూపంలో జరిగిన ప్రపంచ మానవాళికి అత్యంత నష్టదాయకమని తెలిపారు. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, యుద్ధం వల్ల ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగి, పరోక్షంగా ఆయా దేశాల ప్రజలపై భారాలు పెరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా శాంతి కోసం, పాలస్తీనాకు అండగా నిలబడాలని సీపీఐ గా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగమయ్య, నగర సహాయ కార్యదర్శులు రమణ, అలిపిర,జిల్లా కార్యవర్గ సభ్యులు సంతోష్ కుమార్, నగర కార్యవర్గ సభ్యులు బంగారు భాష, రామయ్య ఎల్లుట్ల నారాయణస్వామి,రామాంజనేయులు, జమీర్, మునాఫ్, ఆచారి ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్, శ్రీనివాస్ సహాయ కార్యదర్శులు సురేంద్ర అశోక్ , కన్నా, మహిళా సమైక్య నాయకులు వరలక్ష్మమ్మ, కమ్మక్క నగర సమితి నాయకులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు..