Sunday, June 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్ డి టి సేవా కార్యక్రమాలను పునరుద్దించండి..

ఆర్ డి టి సేవా కార్యక్రమాలను పునరుద్దించండి..

శ్రీ సాయి రూరల్ విభిన్న ప్రతిభావంతుల మండల సమైక్య
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి లో గల ఆర్ డి టి సంస్థ యొక్క సేవా కార్యక్రమాలను పునరుద్దించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ పట్టణంలోని శ్రీ సాయి రూరల్ విభిన్న ప్రతిభావంతుల మండల సమైక్య కమిటీ వారు ఆర్డిఓ మహేష్ కు, తాసిల్దార్ సురేష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్డిటి సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పైగా అయ్యిందని బడుగు బలహీన వర్గాల వారికి వెనుకబడిన వికలాంగుల అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలను ఆర్డిటి సంస్థ చేపట్టి వారి అభివృద్ధికి పాటుపడుతుందని తెలిపారు. ఆర్ డి టి సంస్థ రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా సేవలు చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా వికలాంగులకు ఆత్మస్థైర్యం ,మనోధైర్యం నింపుతూ వికలాంగుల జీవితాలలో వెలుగులను ఆర్డిటి సంస్థ నింపుతున్నదని తెలిపారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సి ఏ ఆర్ ఏ నిధులను నిలుపుదల చేయడం వలన రాబోయే కాలంలో అందరూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. విద్యా, వైద్య జీవనోపాదులు తదితర రంగాలలో ఆర్డిటి మరింత అభివృద్ధి చెందిందని తెలిపారు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఎఫ్ సి ఆర్ ఏ ను పునరుద్దించాలని, తద్వారా వికలాంగుల జీవితాలలో వెలుగు నింపాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య నాయకులు ఈశ్వరమ్మ, ఈశ్వర్ రెడ్డి, ఈశ్వరయ్య, నల్లప్ప, చంద్రయుడు, విష్ణుమూర్తి ,చంద్రశేఖర్, రేణుకమ్మ, కాంతమ్మ , కే సప్ప, ప్రభాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు