Saturday, June 21, 2025
Homeజిల్లాలుఅనంతపురంయోగాని జీవన విధానంగా మార్చుకోవాలి

యోగాని జీవన విధానంగా మార్చుకోవాలి

భారత సంస్కృతిని, పరంపరను తెలియజేసే యోగాసనాలను అందరూ ప్రతిరోజు అభ్యాసం చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : విశాఖపట్నం నుంచి శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తదితరులు పాల్గొన్నారు. అనంతపురం నగరంలోని పిటిసి గ్రౌండ్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. విశాఖపట్నం నుంచి లైవ్ ద్వారా కార్యక్రమం వీక్షిస్తూ.. యోగా ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా ఎస్పీ పి.జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, తదితరులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిటిసి గ్రౌండ్ లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో తనతోపాటు జిల్లా ఎస్పీ, జడ్పీ చైర్మన్, జాయింట్ కలెక్టర్, వివిధ ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, వివిధ రంగాల నుంచి 5,037 మంది పాల్గొనడం జరిగిందన్నారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ పాల్గొని యోగాసనాలు చేశామన్నారు. అంతేకాకుండా 6,040 వెన్యూలలో జిల్లాలో మొత్తం దాదాపు 10 లక్షల 87 వేల మందిని కూడా ట్రైనర్లు ట్రైనింగ్ చేయడం జరిగిందని, నెల రోజులపాటు నిర్వహించిన యోగా మాసంలో పాల్గొని సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ యంత్రాంగం, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. యోగాంధ్ర కార్యక్రమం అనంతపురం జిల్లాలో విజయవంతంగా సంపూర్ణమైందన్నారు. ఈరోజు ఒక్కరోజే కాకుండా యోగాను ప్రతి రోజు అభ్యాసం చేసుకోవాలని అందరినీ కోరారు. ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోవాలని, పిల్లలు, పెద్దవయస్కులు అందరూ చేయగలిగే, భారత సంస్కృతిని తెలియజేసే యోగా ఆసనాలను అందరూ చేయాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ వచ్చి విజయవంతం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. యోగా రిజిస్ట్రేషన్ నమోదులో అనంతపురం జిల్లా రాష్ట్రంలో టాప్ 6 లో ఉందని, జిల్లాలు దాదాపు 10 లక్షల 87 మంది ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం బాగా పెట్టుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ… అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో 5 వేల మందికిపైగా యోగా చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ… జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు ఒక్క రోజుకే పరిమితం కాకుండా ప్రతిరోజు ఆరోగ్యంపై దృష్టి పెట్టి యోగా చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషకరమైన, ఆరోగ్యకరమైన అనంతకు కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం యోగాంధ్ర కాంపిటీషన్స్ 2025లో అనంతపురం జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు గెల్చుకున్న వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జడ్పీ చైర్పర్సన్, జాయింట్ కలెక్టర్ సన్మానించారు. ఈ సందర్భంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ దివాకర్, వివేకానంద యోగా కేంద్ర రాజశేఖర్ రెడ్డి, పతంజలి స్వాభిమాన్ ట్రస్ట్ రవిప్రసాద్, బ్రహ్మకుమారిస్ శారదా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ మమత, సద్గురు ఈష ఫౌండేషన్ ఆదిత్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. తదనంతరం డిఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులను, యోగా గురువులను, సన్మానించడం జరిగింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కు శాలువా కప్పి మొక్కను అందజేసి నగరపాలక సంస్థ కమిషనర్ సన్మానించడం జరగగా, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, జడ్పి చైర్ పర్సన్, తదితరులను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సే నో టు ప్లాస్టిక్ బ్యాగ్ అంటూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్స్ ని అందజేశారు. అనంతరం యోగా ప్రతిజ్ఞ చేసి, జాతీయగీతం ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్లు వద్ద సెల్ఫీ దిగేందుకు ప్రజలు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ మాజీ మేయర్ ఎం.స్వరూప, డిఆర్ఓ ఏ.మాలోల, ఆర్డీవో కేశవ నాయుడు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, డిఆర్డీఏ పిడి శైలజ, ఆయుష్ అధికారులు డా.రామ్ కుమార్, లాల్యానాయక్, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ పావని, డీపీఓ నాగరాజునాయుడు, జడ్పి సిఈఓ శివశంకర్, డ్వామా పిడి సలిం భాష, డిసిహెచ్ఎస్ డా.పాల్ రవికుమార్, జిల్లా సైనిక్ సంక్షేమ శాఖ అధికారి పి.తిమ్మప్ప, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ బాలకొండయ్య, జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి, తహసిల్దార్ హరికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా గురువులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులు, పెద్ద ఎత్తున ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు