విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : సంగీతం లో అనంత సాగరమంత సంగతులు ఉంటాయని సంగీతం సార్వజనీనమైనదని ప్రముఖ సంగీత విద్వాంసురాలు వరలక్ష్మీ త్యాగరాజ సంగీత నృత్య కళాశాల వ్యవస్థాపకురాలు లక్ష్మీ రామదాసు పేర్కొన్నారు. ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులుసముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సంగీతం ప్రధానంగా మనోల్లాసాన్ని కలిగించే కళ అని నిర్దిష్టమైన స్వర లయలతో కూడిన శ్రుతి బద్ధమైన సంగీతధ్వనులు నేరుగా మనసుపై ప్రభావం చూపుతాయని,.శ్రావ్యమైన సంగీత ధ్వనులు మనసును సేద తీర్చి ఆనంద డోలికల్లో ఓలలాడిస్తాయని అన్నారు.. సంగీతం శిశువులను, పశువులను, చివరకు పాములను కూడారంజింపజేస్తుంది. సంగీతం మనోరంజకమైన ధ్వని. ఆరు లలిత కళల్లోనూ పండిత పామరులను ఉర్రూతలూగించగల కళ అని పేర్కొన్నారు .ఈ సందర్భంగా లక్ష్మీ రామదాసును సమాఖ్య అధ్యక్షులు గురు ప్రసాద్ , శ్రీ బాలాజీ టెక్స్టైల్ మార్కెట్ పూర్వ అధ్యక్షులు పులిపాటి రామారావు , ఎం సుభద్ర దేవి తదితరులు సత్కరించారు .కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఆలపించిన గీతాలు అలరించాయి