Wednesday, June 25, 2025
Homeకార్మిక సమ్మె జయప్రదం చేద్దాం

కార్మిక సమ్మె జయప్రదం చేద్దాం

సీపీఐ రాష్ట్ర కార్యవర్గం పిలుపు
ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దాడులకు ఖండన
4 లేబర్‌ కోడ్ల రద్దు, ఉపాధి హామీ వేతనం రూ.600 అమలుకు డిమాండ్‌

దేశ వ్యాప్తంగా జులై 9న తలపెట్టిన కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పిలుపునిచ్చింది. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దాడులను తీవ్రంగా ఖండిరచింది. కె.శివారెడ్డి అధ్యక్షతన విజయవాడ దాసరి భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది.

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: దేశ వ్యాప్తంగా జులై 9న తలపెట్టిన కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పిలుపునిచ్చింది. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దాడులను తీవ్రంగా ఖండిరచింది. కె.శివారెడ్డి అధ్యక్షతన విజయవాడ దాసరి భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఇందులో పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పాల్గొని జాతీయ రాజకీయ పరిణామాలపై వివరించారు. రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్‌ కర్తవ్యాలను తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలను నిరసిస్తూ జులై 9న రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ ప్రాంతంలో ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో జులై 9న దేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల అధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మద్దతు ప్రకటిస్తూ… సమ్మెను జయప్రదం చేయాలని ప్రజానీకాన్ని కోరింది. సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించిన వివరాలిలా ఉన్నాయి. అర్థ శతాబ్ద కాలం నుంచి ఇరాన్‌, అమెరికా సంబంధాలలో వచ్చిన మార్పులవల్ల ఇరాన్‌పై అమెరికా అనేక ఆంక్షలు విధించినప్పటికీ… ఇరాన్‌ తన చుట్టూ ఉన్న అరబ్‌దేశాలతో మంచి సంబంధాలు నెరపుతూ అభివృద్ధి బాటలో పయనిస్తోందని, శాంతియుత అవసరాలకు అణు ఇందనాన్ని ఎన్‌పీటీ నిబంధనల కనుగుణంగా అభివృద్ధి పరచుకుంటుండగా… దీనిని సాకుగా చూపించి ఆమెరికా, ఇజ్రాయిల్‌ ఇరాన్‌పై ఏకపక్ష దాడిచేసి అక్కడి ప్రభుత్వాన్ని మార్పుచేసి, అమెరికాకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరాన్‌వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా ఏకపక్షంగా ఇజ్రాయిల్‌, అమెరికా దేశాలు ఇరాన్‌పై దాడి చేయడాన్ని సీపీఐ కార్యవర్గం తీవ్రంగా ఖండిరచింది. మోదీ ప్రభుత్వం 42 కార్మిక చట్టాలు రద్దు చేస్తూ…4 లేబర్‌ కోడ్లు తీసుకువచ్చిందని, జూన్‌ 4న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు మార్పుచేస్తూ మహిళా ఉద్యోగులు రాత్రిపూట కూడా డ్యూటీలు చేసే విధంగా నిర్ణయించడాన్ని సమావేశం నిరసించింది. మోదీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్‌ కోడ్లలో భాగంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఈ నిర్ణయం చేసిందని తెలిపింది. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీస్‌ చట్టం, షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాలకు సవరణలు తెచ్చి రోజుకు 8 గంటల పని స్థానంలో 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిందని, సరైన రక్షణ, సౌకర్యాలు కల్పించకుండా మహిళలతో రాత్రి షిప్ట్‌లలో పని చేయించుకునేందుకు యాజమాన్యాలకు స్వేచ్ఛ ఇస్తూ, శ్రామిక మహిళల హక్కులను కాలరాసేలా చట్టంలో సవరణలు తెచ్చిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాలలో తెచ్చిన సవరణలను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్‌ చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు