Homeవ్యాపారంటయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ కొత్త కార్యాలయం ప్రారంభం

టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ కొత్త కార్యాలయం ప్రారంభం

- Advertisement -

ఛత్రపతి శంభాజీ నగర్‌: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం) బుధవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌ (సీఎస్‌ఎన్‌)లో తన కొత్త నగర కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో తన ఉనికిని బలోపేతం చేయడానికి, భారతదేశ ఆటోమోటివ్‌ పరిశ్రమకు తోడ్పడటానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఒక కీలక మైలురాయి. జూలై 2024లో టీకేఎం, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనికి అనుగుణంగా ఈ అభివృద్ధి ఉంటుంది. ఈ ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్‌ తయారీ సౌకర్యాన్ని స్థాపించడానికి వీలు కల్పించే లక్ష్యంతో ఉంది. ఈ కొత్త కార్యాలయం టీకేఎం ప్రాంతీయ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడానికి, పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన కేంద్రంగా పనిచేస్తుంది. ప్రోజోన్‌ మాల్‌ చికల్తానాలో 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త కార్యాలయాన్ని టీకేఎం చైర్మన్‌, ఎండీ, సీఈవో మసకాజు యోషిమురా, గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌ కార్పొరేట్‌ ప్లానింగ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్వప్నేష్‌ మారు ప్రారంభించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు