రాష్ట్రంలో కొత్తగా 2,672 పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 91,594 నమూనాలను పరీక్షించగా.. గడిచిన 24 గంటలో కొత్తగా 2,672 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 18 మంది మృతిచెందారు. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. తాజాగా 2,467 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,98,966 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 13,115 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,34,88,031 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.