Wednesday, February 5, 2025
Homeజిల్లాలుకర్నూలుజన సైనికుడికి ఆర్థిక సహాయం అందజేత

జన సైనికుడికి ఆర్థిక సహాయం అందజేత

విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడు హనుమంతుకు రూ. 25 వేల 600 రూపాయలు ఆర్థిక సహాయాన్ని శుక్రవారం జనసేన పార్టీ మండల కన్వీనర్ అరవింద్, ఏపీ కురువ కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని హలిగేర గ్రామానికి చెందిన జన సైనికుడు హనుమంతు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఆలూరు జనసేన పార్టీ ఇంచార్జి తెర్నేకల్ వెంకప్ప ఆదేశాల మేరకు హనుమంతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా రూ.25,600 అందజేయడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసిన వారే నిజమైన జనసైనికులు అని కొనియాడారు. కుటుంబానికి అండగా ఉంటాం అంటూ విరాళాలు అందించిన జనసైనికులకు, అభిమానులకు పేరు పేరున నా హృదయపూర్వక అభనందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు శివ, సోమశేఖర్, శ్రీను, రంజిత్, మహదేవ్, హనుమేష్, వీరేష్, విష్ణు, అనిల్, అంజి, సురేష్, ప్రసాద్, వినోద్, ప్రకాష్, రంగ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు